పుట:Shodashakumaara-charitramu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

35


నచలగతి న్ముసుంగిడి లతాంగిగతి న్వెలి కల్ల నేగినన్.

121


వ.

పరిజనంబులు సంభ్రమంబున నెద్దియు నెఱుంగక యాందోళిక యెక్కించుకొని క్రందుకొనం గొలిచి యందఱు నరిగిన.

122


క.

మదిరావతిఁ దోడ్కొనిచని
మది రాగం బెసఁగ దుర్గమందిరమున నె
మ్మది రాగిల్లుచు నుండఁగ
నది రాజ్యముకంటె నాకు హర్షముచేసెన్.

123


వ.

అట్లుండునంత బుద్ధిసాహాయ్యుండు మూఁడవజామునఁ బ్రియకామినీసహితుం డై యచ్చటికి వచ్చిన నచ్చెరు వంది పిచ్చలించుచునున్న యంతరంగంబు లలక గాఢాలింగనం బాచరించి యిచ్చెలువ యెచ్చట నీకుం జేకుఱె ననిన హాసభాసితవదనుం డగుచు నిట్లనియె.

124


ఉ.

ఏ వనితాకృతి న్నగరి కేగి నృపాత్మజ యుండునట్టి య
య్యోవరి కేగి తల్పమున నొప్ప ముసుం గిడి యున్న యంత న
న్భూవరకన్యఁగాఁ దలఁచి పొల్తుక యొక్కతె చేరవచ్చి తా
నావనజాక్షి చిత్తగతి యంతయు మున్నె యెఱుంగుఁ గావునన్.

125


వ.

ఎవ్వరు వినకుండ నల్లన నిట్లనియె.

126


ఉ.

వందఁగ నేల యిట్లు వలవంత దొఱంగుము రాజకన్యకుం
బొందఁగవచ్చునమ్మ తనబుద్ధికి వచ్చినవానిఁ దండ్రి యా
త్మం దలపోసి యిచ్చినయతండు వరుండని యుండు నెమ్మితో
నందని మ్రానిపండులకు నఱ్ఱులు సాఁపరు పద్మలోచనల్.

127