పుట:Shodashakumaara-charitramu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

25


వ.

మఱియు నక్కుమారు నాలోకించి.

62


క.

నాయష్టిమహత్త్వంబున
నీయెడ దేవరకు నుండ నిరవుగ సకల
శ్రీయుతమై తగుపట్టణ
మాయకముగ వ్రాయువాఁడ నని యుత్సుకుఁ డై.

63


సీ.

మణిహేమవిస్తారమందిరప్రాకార
        సౌధదేవాలయసంచయములు
ఘనసత్త్వబంధురగంధర్వసింధుర
        దుర్దమసుభటసందోహళములు
వరధరణీదేవవైశ్యశూద్రాదినా
        నాజాతు లైనజనావళులును
నిరుపమలావణ్యసురుచిరగుణగణ్య
        పణ్యపుణ్యాంగనాప్రకరములును
సన్నుతగృహోపవనములు సర్వనిధులు
నెఱయవ్రాసిన నన్నియు నిక్కువంబు
లై త్రిలోకపురీరాజ్య మనఁగఁదగిన
పట్టణము వొల్చెఁ గన్నులపండు వగుచు.

64


వ.

ఇట్లు చిత్రంబుగాఁ జిత్రకరుండు పురంబు నిర్మించి దానికిం జిత్రపురం బని పేరిడి యందు రాజమందిరంబునఁ గమలాగరకుమారుని సింహాసనాసీనుం గావించి తానును భీమభటుండును గరుణాకరుండును, సముచితప్రకారంబులం గొలుచుచు మణికనకభాసురనివాసంబుల విశిష్టవిభవంబుల నుల్లసిల్లుచున్నంత.

65