పుట:Shodashakumaara-charitramu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

షోడశకుమారచరిత్రము


జెప్పకయున్నఁ ద ప్పనుచు శీఘ్రమునం జని యేకతంబునం
జెప్పినఁ గూఁతులాగునకుఁ జిత్తములోపల వంత మీఱఁగన్.

57


చ.

తనసుతవర్తనంబు విదితంబుగ నారయఁ బ్రోడ నోర్తు బం
చిన నది యేగుదెంచి యొకచెంగట నుండి రతాంతవేళ మా
నినియును నేను మైమఱచి నిద్దుర వోవఁగఁ జూచి ప్రోడలీ
ల నెఱయ నాదుచేలమున లత్తుకరేఖలు వ్రాసె నచ్చుగన్.

58


క.

అంబుజముఖి యిటు లడియా
ళంబులు గావించి చెప్ప లాక్షాంకసమే
తాంబరుఁ బురిఁ దడవుండు ర
యంబున నని రాజు భటచయంబుం బనిచెన్.

59


వ.

ఆవృత్తాంతం బంతయు రాజసదనాంతర్వర్తిని యగు నావృద్ధజంతచేత విని యచ్చట నునికి యకార్యం బని నిశ్చయించి పాదుకాసమన్వితపాదుండ నై పాత్రయు లాతంబునుం గొని యాక్షణంబ కమలాక్షి యున్నసౌధంబునకుం జని సకలంబు నెఱింగించి గమనోన్ముఖుండ నగుటయు నిన్నుం బాసి నిమేషం బైనను బ్రాణంబులు నిర్వహింపనేర నీతోడన వచ్చెదఁ దోడుకొనిపొ మ్మనిన నిమ్మగువం గరంబులం బొదివికొని గగనగమనంబున వచ్చి వచ్చి యిచ్చట దేవరం గాంచి యానందకందళితభావుండ నగుచు నవతరించితి ననుచు విన్నవించి.

60


గీ.

భక్ష్యభోజ్యలేహ్యపానీయచోష్యముల్
సంకుమదపటీరచంద్రమృగమ
దములు పాత్రమహిమఁ దత్క్షణమాత్రన
పడసి నెచ్చెలులకుఁ బతికి నొసఁగి.

61