పుట:Shodashakumaara-charitramu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

21


శాా.

ఈ పాత్రంబు నిరంతరేష్టఫలదం, బీయష్టి వ్రాయంగ నే
రూపంబైనను నిక్కువంబ యగుఁ, జేరుం గోరుచో టన్నరుం
డీపాగ ల్దొడినప్డు, మత్పితృధనం బీవస్తువు ల్వీనికై
కోపం బారఁగఁ బోరఁగావలసె మాగుం బాలువోకుండుటన్.

39


క.

అనుటయు నతిముత్సరతం
బెనఁగెడు వారలను గాడుపెట్టి పఱచి కై
కొనియెద నీవస్తువు లని
మనమున నూహించి చతుర(మత) మేపారన్.

40


క.

ఇరువురు సంగడి విడువక
పరువునఁ జనుచోటఁ గడవఁ బాఱెడువాఁ డీ
వరవస్తువులకు నొడయఁడు
సరభసగతి నరుగుఁ డనిన సమ్మద మొదవన్.

41


క.

ఏ విడువఁగ సమసత్త్వులు
గావున నొండొరులం గడవగాఁ జాలక యా
దేవారులు ద వ్వరిగిన
నావలఁ బాఱి రని నెమ్మనమున నలరుచున్.

42


క.

త్వరతో యష్టియుఁ బాత్రయుఁ
గరమునఁ గబళించి పాదుకలుదొడి యేనం
బరగతి...నాయంజక
పురమున కరిగితిఁ గుమారపుంగవ వినుమా.

43


క.

అందొక్క వృద్ధకామిని
మందిరమున విడిసి తదభిమతధనములు పెం
పొందఁగ నిచ్చియు నప్పురి
యందొప్పెడు కాంత గలదె యనియడుగుటయున్.

44