పుట:Shodashakumaara-charitramu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

15


వ.

ఇట్లు సాధకుండు కామాతురుండై మంత్రసామర్థ్యంబు గోలుపోయిన.

12


క.

పారావతాక్షుపనుపున
ఘోరతమం బడర భూతకోటులు భయదా
కారత సాధకుఁ బొదివి మ
హారవ మెసఁగంగ నార్చి యాగ్రహమొప్పన్.

13


వ.

కడకాలు పట్టి దవ్వులం బడవైచిన వాని వెదక సంభ్రమించి యందఱు నన్నివంకల నమ్మహాటవి దరియం జొచ్చి వెదకి వెదకి దిగ్భ్రమనొంది వచ్చిన జాడ యెఱుంగక యొండొరులం బొడగానక తిరుగుచుండ భూపాలనందనుండు కొన్నిదివసంబులు చెలులం దడవి యొక్కనాఁ డొక్కయేటిదరి నరుగు సమయంబున.

14


ఉ.

గ్రాహము తన్నుఁ బట్టినఁ గిరాతుఁ డొకండు ఘనార్తిఁ గూయుడు
న్సాహసమార నానృపతినందనుఁ డానదిఁ జొచ్చి యుద్ధతి
న్బాహుశితాసి దానివదనంబు రయంబున వ్రచ్చి బోయ న
వ్వాహిని వెల్వరించుటయు వాఁడు ముదం బెసఁగంగ నమ్రుఁడై.

15


క.

పూని యకారణబంధుఁడ
వై నాప్రాణములు గాచి తసమానకృపాం
భోనిధి నను నీదాసుని
గా నేలితి, రమ్ము నాయగారమ్మునకున్.

16


వ.

అని తా నేలెడి కిరాతపల్లికిం దోడ్కొని చని సముచితసంభావనంబు లొనరించి నిజగృహంబులలో నొక్కరమ్యసదసంబున నునిచిన నుండి నాఁటినిశాసమయంబున రత్నదీప