పుట:Shodashakumaara-charitramu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

షోడశకుమారచరిత్రము


సీ.

నాఁ డెఱుంగం గాని నేఁ డెఱింగితిఁ శైలి
        యత్యగమ్యం బైనయప్పురమున
కరిగి చంద్రప్రభ యనుకాంతఁ బొడగంటి
        నది తనసోదరు లైనసతులు
మునిశాపమున మర్త్యమును బొంది రని చెప్పి
        నను వరించెద నని జనకుకడకు
నరిగిన నేను సౌధాగ్రంబునకు నేగి
        మూఁడుతల్పంబుల మూఁడుయువతి
రూపములఁ గంటి నం దొక్కరూపు నీదు
రూప మై యున్న వెఱఁగంద నేపు మిగిలి
తురగ మొక్కటి నినుఁ జేర గొరిజఁ జిమ్మఁ
బడితి నిప్పురిలోపలఁ బద్మనయన.

156


వ.

అనినమాటలు విని యాక్షణంబ యమ్మానిని విగతజీవ యైన నాశ్చర్యంబు నొంది యంతన తెలి వొంది యాకనకపురిసౌధాగ్రంబునం గనినమానినీరూపంబులు మూఁడును దత్సోదరుల నైజరూపంబులు గానోపు నందు మూఁడవరూపం బీయింతిది, దీని జీవం బచ్చటి కరిగినది నాకు నిచ్చటం దడయం బని లే దన్నలువుర వరియింపక కమలాకరమహీవరదర్శనంబును సమకూరదు గాన మున్ను చనినమార్గంబునం జనియెదం దత్తరుణీవరణంబు దైవనిర్మితం బగుట నాకు నవశ్యంబును హేమపురదర్శనంబు సిద్ధించు ననుచు నిశ్చయించి వెడలి మున్ను చవినసముద్రతీరంబున కరిగి యచ్చట.

157


క.

జలనిధిలోపల నాఁ డట
కల మవిసిన బ్రదికి వచ్చి కడఁ జేరిన యా