పుట:Shodashakumaara-charitramu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

షోడశకుమారచరిత్రము


క.

చిలుకా యిట్టివిలాసము
గలపురుషుఁడు జగమునందుఁ గలఁడో యీయు
జ్జ్వలరూపము నీకరకౌ
శలము మెఱయ వ్రాసితో నిజంబుగఁ జెపుమా.

57


వ.

అనిన నానేర్పువిధంబును దేవరయన్వయనామధేయవిలాసరాజ్యవైభవంబులు వినిపించి మనోభవాధీనమానసం గావించిన నతిప్రయత్నంబున నీచీనాంబరంబునందుం దాన యీయార్య లిఖియించి యిచ్చి నాకు వివిధవిశేషసంభావనంబు లొసరించి పుత్తేర నిచ్చటికి వచ్చితి నని యాయార్యాక్షరపంక్తి మనోహరం బైనకళావతీకరస్థం బగునంబరం బవ్విభునిముందటం బెట్టి యవధరింపు మనిన వేడ్కలు సందడింపం గరంబు చాచి యందుకొని.

58


క.

పద్యము రెండర్థములను
హృద్యం బగుటకును వ్రాల యేర్పాటునకుం
జోద్యముఁ బొంది కరంగుచు
నుద్యత్పులకాంగుఁ డగుచు నున్నంత వెసన్.

59


క.

కీరత దొఱంగి యది గుణ
నీరధి యగుతమవివేకనిధి యై తనకున్
బోరునఁ బ్రణమిల్లుటయును
భూరమణుం డద్భుతంబుఁ బొందిన మదిలోన్.

60


వ.

దిగ్గన సింహాసనంబు డిగ్గి యిచ్చ యలరం గవుంగిలించుకొని తా నెప్పటియట్ల యాసీనుండై యతని సముచితాసనంబున నునిచికొని యాక్షణంబ భీమభటాదు లగుమంత్రుల రావించిన వార లతనిం గని ప్రమోదమానసు లై పరిరంభ