పుట:Shathaka-Kavula-Charitramu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xliii)

అని యుద్రేకముతో సంబోధించుచున్నాఁడు. ప్రోత్సహించుచున్నాఁడు. నిందాగర్భముగఁ బలుకుచున్నాఁడు. తెగఁబడి తిట్టుచున్నాఁడు. దేవుని భయపెట్టుచున్నాఁడు. బ్రతిమాలుచున్నాఁడు. "అదె! తుఱకబలము వచ్చె”నని చూపుచున్నాఁడు. " సేన నిర్జించి యీ యాంధ్రసృష్టి నిల్పు”మని బ్రతిమాలుచున్నాఁడు. ఇచ్చటి భావావేగము వర్ణనాతీతము. చదువరులకే తెలియవలయును. ఆభయము దర్శనీయము, ఆభక్తుఁడు మనోరంగమునఁ దిలకింపదగినవాఁడు. కరుణ రసపూరిత మగుహృదయముతో నాశతకమును ముగింపవలసినదే! ఇట్టివి పెక్కుశతకము లున్నవి.

మన గ్రంథములలో భావము లుండ వనియుఁ బ్రకృతిపరిశీలన ముండ దనియుఁ బలువురితలంపు. అట్టివారి కీక్రిందిపద్యము పఠనార్హ మైనది. చూడుడు కృష్ణానది నలుపు, అదిసంగమ మగుచోట సముద్రము నలుపు, పై యాకాశము నలుపు, ఆమహారంగమును మనస్సులో ధ్యానించుకొనుఁడు. నది సాగరగతి యైనసంగమస్థలియం దుల్లోల కల్లోలితము లగుగంభీరజలములలోతు, అందుఁ బ్రదర్శిత మగుచున్న నీలపుటాకసపులోతును ధ్యానించుకొనుఁడు. గట్టుదరి నేర్పడినదీవినిఁ బరికింపుఁడు. దీని చుట్టులేచి కరగిపోవు. తెల్లనుఱుగులఁ దిలకింపుఁడు. ఆహంసలదీవిపరిసరముల విహరించిననల్లదొంగపై నల్లినకాసుల పురుషోత్తముని పద్యమును వినుఁడు.

సీ. భువనత్రయీక సంపూర్ణుఁడవగునీకు, నందకుటీరమా మందిరంబు
    పొలమున్నీటిలో నోలలాడెడు నీకు, మహి యశోదాస్తన్య చూబలంబు
    పదపద్మమునగంగ యుదయమందిన నీకు, జలకామాగోపి కాంజలిజలంబు
    హరిరాజు భోగవతి యంకంబుగల నీకు, తల్పమారాధికాతరుణియంక

గీ. మహహ! వారలభాగ్య మెంతనఁగవచ్చు, భావజవిలాస! హంసలదీవి నాస!
    లలితకృష్ణాబ్దిసంగమ స్థలవిహార! పరమకరుణా స్వభావ! గోపాలదేవ !!