పుట:Shathaka-Kavula-Charitramu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxxvii)


చతుప్పాదయుక్తం సరోజంచచిత్తం, షడానందకారం స్ఫురద్ద్వాదశారం
స్వరద్వంద్వయుక్తం సరోజం స్మనేయం, చిదానందరూప శ్శివోహంశివోహం!! 1
ఆనాకాశ మాకాశ మాకాశరూపం, నిరాకార సాకార మోంకారగమ్యం
సహస్రార మధ్యస్థ బిందుస్వరూపం, చిదానందరూపశ్శివో హంశివోహం!!
                                                             (చిదానందద్వాదశస్తోత్రము)

సంస్కృతమునందును భక్తుల స్తుతులు, స్తవములు, మకుట సహితములు.

(2) ఇట్లే ఋగ్వేదము, 1-17 లో పదిఋక్కులు "మరుద్భిరన్న ఆగహి” అని కొట్టకొనను మకుటమువలె గలవి యున్నవి.

(3! ఇట్లే పాళీభాషలో నున్నవి.

కాని మనశతకములకీమకుటముతప్పనిసరిగఁ గనఁబడుచుండును. లేనివి లెక్క కొకటిరెండుమాత్ర మున్న ట్లున్నది. ఈమకుటమును బట్టియే శతకనామ మేర్పడును. శతకనామమే కాదు. శతకము వ్రాయవలసినవృత్తమును ఒకప్పుడు యతిప్రాసలునుగూడ నీమకుటముపై నాధారపడియుండును. “ఇందూ నందునిమందనుండిక దనీ వేతెంచుటల్ రాకల౯" అని మకుట మేర్పఱచుకొని చంద్రదూత వ్రాసిన పుసులూరి సోమరాజకవి శతక మంతయు బందుపూర్వకదకార ప్రాసముతోవ్రాయవలసివచ్చెను. వేమన నాల్గవపాద మంతయు మకుటముతోనే నింపుటచే నాతఁ డాట వెలదులతోనే రచింపవలసివచ్చెను. “సుమతీ" యనుమకుట మున్నకవి కందములే వ్రాయవలసివచ్చెను. "శ్రీకాళహస్తీశ్వరా” యన్నమకుట మేర్పఱచిన ధూర్జటి నాల్గవపాదము మొదటియక్షరముపై నొకకన్నుంచి ప్రతిపద్యము వ్రాయవలసి వచ్చెను. కవిచౌడప్పయు నిట్లే కదా! చూపుచు: బోయిన ననేక వైచిత్ర్యము లున్నవి.

కాఁబట్టి శతకమునందు మకుటనిర్ణయము ప్రధానకార్యము . ఇది మనతెలుఁగు శతకములయందు వైలక్షణము దాల్చుటకుఁ గారణ