పుట:Shathaka-Kavula-Charitramu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxix)

ఒకపద్యమైన ముక్తకము రెండునుమూఁడు, ద్వికమును ద్రికమునై విస్తరిల్లు
బంచరత్నములైదు పరగ నెన్మిదిగజా. వళికి నామావళి ద్వాదశంబు
నెన్నంగ నిరువదియేడు తారావళి, యెవయ ముప్పదిరెండు నేఁబదియును
నూఱు నూఱెనుబది నుతికెక్కి ద్వాత్రింశ, దభిధాన పంచాదశాఖ్యనాఁగ
వెలయు శతకమన వెండియష్టోత్తర, శతకమనఁ గ నిట్లు సకలసుకవి
సమ్మతముగ నెగడు జాటుప్రబంధము, లభిమతార్థరచన వబ్జనాభ. 3-62

ఇతఁ డప్పకవికంటెఁ దక్కువభేదములఁ జెప్పెను. ఎట్లయినను వీనికిఁ గావ్యసిద్ధి కలిగినట్లు వారు చెప్పినను సవతితల్లిప్రేమమునేకనఁ బఱచిరి.

కవిజీవితకారు లీశతకములవిషయము వ్రాయలేదు. కవి చరిత్రకారు లగుశ్రీవీరేశలింగముపంతులు గారు వీనియందు నిరసనభావముకూడఁ గనఁబఱచినారు. శబ్దరత్నాకరకర్త పేరు కొఱకొకటి రెండు శతకములనుండి ప్రయోగముల నిచ్చెనుగాని, తాను గ్రంథాదిని సూచించిన గ్రంథములపట్టికలో శతకముల నాల్గవతరగతిలో నైన నుదాహరింప లేదు. స్త్రీలు కవిత్వము చెప్పి రనిన సంతోషపూర్వకముగ నట్టి స్త్రీలచరిత్రమును గనుఁగొని ప్రకటింపవలసినకవిచరిత్రకారు లగుశ్రీ వీరేశలింగముపంతులుగారు శ్రీ మదిన సుభద్రమ్మగారు శతకములు వ్రాసినారని తరిగొండ వేంకమాంబచరిత్రము తుదను చెప్పివిడిచినారు. శతకములు వ్రాసిన స్త్రీ లనేకు లున్నా రనిరే కాని వారిపేళ్లయిన నుడువలేదు. బహుజనపల్లి సీతారామాచార్యులు గారు " జాలమ్యాల రామకృష్ణ” యని తాళరాగములనడుమ విరిగి ముక్క లైనమవ్వగోపాలపదములపాటియైన గౌరవము శతకములలో ముఖ్య మైసవానికైన నిచ్చినారు కారు. శ్రీరామమూర్తి పంతులుగారు వ్రాసిరో లేదో సందేహము. ఇది యంతయు శతకముల నాదరణబుద్ధితోఁ జూచి రనుట కనువుగానున్నదా?

క్షేత్రయపదములు నిఘంటకర్తలకు క్షేమలాభము లిచ్చి ధూర్జటి కాళహస్తీశ్వరశతకము, పానకాలరాయని మానసబోధశతక