పుట:Shathaka-Kavula-Charitramu.pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముడుంబై వేంకటరామనృసింహాచారి


కవి వివరము లేమియు దెలియవు. శ్ర్రీవైష్ణవుడని యూహింపవచ్చును. రంగేశ్వరకృష్ణశతకము వ్రాసెను. రుక్మిణీకల్యాణ కథాత్మక మగునీశతకము మనోహరముగ నున్నది. శ్రీకూర్మమునకు దగ్గరనున్న వంశధారతీరమందలి యచ్యుతపురి వాసుడు.

రంగేశకృష్ణశతకము.