పుట:Shathaka-Kavula-Charitramu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxiv)

సి లలిన్ దివ్యసుమాంబరాభరణముల్ శ్రీమించఁ జేకొన్నయో
గ్యులమేటిన్ గవిరాజ నెన్నఁదరమే గోపాలవిద్వన్మణి౯

ఆకాలమునందు శతకము లాశువుగఁ జెప్పి బహుమానము లందువాడుక యన్నట్లు పెక్కు నిదర్శనములఁ జూపవచ్చును.

(2) గణపవరపు వేంకటకవి కఠినప్రాసశతకము, యమకశతకమును, కస్తూరిరంగని సాంబనిఘంటువు సీసశతకమునఁ జెప్పుటయు శతకవాఙ్మయవ్యాప్తినే సూచించును. హంసవింశతికర్త అయ్యలరాజు నారాయణకవి "నఖగర్త పురాంజనేయ నతజనగేయా” అని కందశతకమువ్రాసెను.

వైష్ణవభక్తులలోఁ దాళ్ళపాకవారి శతకములు 15, 16, 17 శతాబ్దములలో ననేకములుపుట్టినవి. తాళ్ళపాకవారి వేడెనిమిది శతకములు దొరికినవి. శతకములాది నకారాదిగ నియమమేర్పఱచుకొని వ్రాసినట్లుసుమతి భాస్కర వేణుగోపాల శతకములు సాక్ష్యమిచ్చుచున్నవి. ఇందువలనఁ గవి వ్రాసిన పద్యములవరుస తప్పకుండఁ దెలియనగును. సుమతిశతకకర్త బాలురకొఱ కీనియమము పాటించెనని తోఁచుచున్నది. అందలి మొదటిపద్యము "అక్కఱకురాని చుట్టము. ” పిమ్మట "ఆ" "ఇ" "క" “గ” ఈవిధముగ వ్రాయుటకుఁ గవి నియమమేర్పఱచుకొనెను. వివరములు గ్రంథమున సూచించితిని.

17వ శతాబ్దమునకుఁ బిమ్మట శతకములు మితిమీరిపోయినవి. అందఱును శతకములే వ్రాసిరి. వృత్తసాధనమునకుఁ బ్రారంభమున నీశ్వర దైవపార్ధనమునకుఁ గూడఁ బనికివచ్చి, యుభయతారకముగ నుండు నని యొక్కొకవృత్తముతో నొక్కొక శతకముచొప్పున ప్రతి కవియు పదులు వందలు శతకములు వ్రాసినట్లు కనఁబడుచున్న ది.

(1) పంచడబ్బులలో నొకటగు కృష్ణార్జునసంవాదము వ్రాసిన