పుట:Shathaka-Kavula-Charitramu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

శతకకవులచరిత్రము

యసమయాధురీణతకు నంకిలిపాటు ఘటిల్లకుండ న
స్వసిఁగొని బ్రోవుమయ్య బసవా” 107

పండితమల్లికార్జునుఁడు బసజస్తుతిగాఁ గొన్నికావ్యములు రచియించె నని మనము తెలిసికొనియున్నాము. ఆవిషయము సోమనాథుఁ డీక్రింది.పద్యమున సూచించెను.

“దండితవాదియై శివుఁడె దైవముగాకని కన్నులిచ్చి తా
 నిండుమనంబుతో నిలువుకన్ను లు దాల్చి పోల్చు మా
 పండితమల్లికార్జునుఁడు బ్రస్తుతి సేయఁగ నేర్చు
 నిన్ను నెవ్వండు నుతింపనేర్చు బసవా!" 100

బసవడే శివుడు. శివుఁడే తనవల్లభుఁ డని సోమనాథుఁడు పల్కుచు విశిష్టాద్వైతులనాయక నాయకీభావభరిత మగుభక్తి నీతఁడును బ్రకటించియున్నాఁడు. బసవఁడు "భక్తికళత్రుఁ డ” ని చెప్పుటయే గాక యీక్రిందిపద్యమున స్పష్టపఱచెను.

“నాయొడయండ నావిభుఁడ నాహృదయేశ్వర నామనోహరా
 నాయిలువేల్ప నాపరద నాగురులింగమ నాదుజంగమా
 నాయదినాథ నావరుఁడ నన్నుఁ గృపామతి బ్రోవు మయ్య దే
 నా యమిబృందవంద్య బసవా” 105

ఇట్లు “నాహృదయేశ్వర!” “నామనోహరా"యనివాడినపదములే సోమునిభ క్తినిఁ బ్రకటింపఁ జాలియుండును.

ఇతఁడు పలుభాషలలోఁ బండితుఁ డగుట, వేర్వేఱుభాషలలో స్తుతించినయెడల ఫలప్రద మని యట్లొనర్చియున్నాఁడు.


సంస్కృతభాష

చూర్ణితమన్మధాయ పరిశోభితభస్మవిలేపనాయ సం
పూర్ణమనోరథాయ గతపూర్వభవాశ్రితవర్ణనాయ ని