Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసనపద్యమంజరి.

31


శ్లో.

పూర్వం మహారాష్ట్రజనై ర్హృతోభూత్సౌమిత్రి రార్యాగ్రత ఏవ దుష్టైః
తదా ప్రభృత్యేవ సరామదేవః మహోత్సవస్థోపి బభౌ న కర్హిచిత్.
విజ్ఞాతతద్వేదవిదాం వరిప్టో వేదాంతవర్య స్త్వకరో త్ప్రయత్నం
శ్రీలక్ష్మణస్యాపి కృతౌ శుభాయాం సమస్తరాజన్యవరైరసాధ్యం.

2


శ్రీశంకరాఖ్యం రథకారమాశుసమాంహ్వయామాససురామతీర్థాత్
తేనైవ సర్వోత్తమశిల్పిసంవిదా సకారయామాస సులక్షణాకృతిం.

3


*

రాయాచార్యకృతా నాదౌ శ్లోకాన్ లిఖతవా నహం
తతో మద్రచితాః పద్యాః లిఖతం చ్ఛాంధ్రభాషయా.

1


శా.

ఆది న్మాధ్వు ల్రఘుపతిని రామానుజు న్భూమిపుత్రి
న్మేది న్మోదంబున సితగిరి న్నిల్పినంత్త న్మహారాష్ట్రుల్ దా
సౌమిత్రిశరగొనిన న్రూఢిగావింప్ప భాష్యం
వేదాంత్తాచార్యులు మగిడి దా వేడ్కతో జేయుమంన్నన్[1].

2


క.

కాకుస్థవంశజానుజు। చేకొని హరిభక్తు లెల్ల సేవించుట కై
శ్రీకూర్మక్షేత్రంబ్బున। వాకలపుడిశంక్కరుండు వరుస సృజించ్చెనూ.

3


చ.

అరయగ శాలివాహనశకాబ్దము లుర్వి పదారునూర్లపై
నిరవుగ నెన్బదేను గతియించిన వెన్క స్వభానునామవ
త్సరనిజశుక్రశుద్ధమున సార్ధకమౌ దశమి న్మృగాంకవా
సరమున చిత్తయందు నతిసౌఖ్యత సల్పిరి పూజలక్ష్ములనూ.

4


క.

శ్రీకూర్మేశ్వరుసాక్షిగ। మాకిచ్చిన భూమికలదు మహి నెవరైనన్
బూకరమున లేదనినను। చీ కాదని నడుపవలయు క్షితిపతులైననూ.


క.

తొలుతను రాయాచార్యులు। వెలయగ శ్లోకములు చెప్పి వెనుకను పద్యం
బ్బులు నే తెలుగున జెప్పితి। సలలిత కవి జదివి రెం(ట్టి)జాడల నెంచ్చునూ.


గీ.

పరగ నీరాతి పడమటిపలకయంద్దు। పఙ్తి తడబడి చెరిపియు పంక్తి మగిడి
చెక్కినాడను నను నింద్ద సేయవలదు। కలవు చేతప్పు లని మది దెలియవలయు.

  1. మొదటిపద్యములో ఛందోదోషములు పెక్కు లున్నవి.