పుట:Shaasana padya manjari (1937).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

శాసనపద్యమంజరి.


పట్టుచీరయుం బళ్ళెంబు భక్తి నొసగెం[1]
దనద్దు[2] ధరంబు లాచంద్రతారక(ము)గా.

38. .


శ. స. 1422


ఈ పద్యము గుంటూరుజిల్లా బాపట్ల తాలూకాలోని ఇడుపులపాడు గ్రామములోని
చెన్న కేశ్వరస్వామి దేవాలయములో గరుడస్తంభము పై నాల్గువైపులను చెక్కబడియున్న
యొక సంస్కృత శాసనమునం దిమిడియున్నది- (A. R. 802 of 1922)

వంశావళివద్యము.


సీ. శ్రీయాజ్ఞవల్క్యప్రసిద్ధాస్వయమునందు
ముఖ్యుండు దామయ్య ముత్తతాత
గురుభరద్వాజసగ్లోత్రోద్భవుం డైన
ధన్యుం డనంతయ్య తాత తాత
నిత్యసత్య ... ...వి మానాఖ్యుం ....
ముత్తనాయ ... తండ్రి తాత
భూ వైభవ ...గబ్బు౯కొం డీతండసంగం
దనరు కొండయమంత్రి తండ్రి తండ్రి
మహీమతో దుమ్మ౯ంత్రిమానమద్ద౯ నుం డైన
ఘనుండు ముత్తయమంత్రి కన్న తండ్రి
పరమపాతివ్రత్య భాగ్యసంపన్నయౌ
కమలాక్షి సింగాంబ కన్న తల్లి
అగ్రగణ్యులు కొండయామాత్య చంద్రుండు
రమ్య వైభవుండు శ్రీరంగ విభుండు

........................................................................................................

  1. నొసంగెం- అని యుండవలెను.
  2. దనదు- అని యుండవలెను.