Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసనపద్యమంజరి.

23

30

శ. స. 1145

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 178)

క.

సరసిపురి సస్వతంబై
శరవార్ధిశశాంకభూమిశంకెమెయి న్నీసు
స్థిరుండగు (వ)యపకొమన[1]

—————

31

శ. స. 1150

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 192)

సీ.

శ్రీరమ్య మగుసరసీపురి సోమేశ్వ
            రునకును విష్ణుదేవునకు భక్తి
యమరంగ నిరుసంద్ధియలయంద్దు నెంతయు
            వెలుగంగ్గ ధారుణివ(ల)యనాయం
డగు కేశవాధీశు నతివ శ్రీగు(డు)పూండి
            గోకర్నదేవునకును ముదమునం
బ్రాసాద మెత్తించ్చి బహుధర్మ్మువులయంద్దు
            వరగిన మల్లా(౦బ) వరసుపుత్రి
వ్యోమసాయకభూసుధాధా(మ)సంఖ్యం
గార్త్తికము శుద్ధశివతిథిం గాంత్తిసహితుం
డగుగదాధరదేవని యైతమాంబ
(స)౦ధ్యదీపంబు లొగిం బెట్టె సాశ్వతముగ.

—————

  1. ఇందు తప్పు లున్నవి. పద్య మసంపూర్తిగా నున్నది.