పుట:Shaasana padya manjari (1937).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

శాసనపద్యమంజరి.

కూమ్మ౯ నాథునకు సద్గుణి మాపగాము
శాసనుం డుపమ(న్యు)సన్మునివ రేణ్య
గోత్రుం డేతమనాయకునకుం గండెమకునుం
దనయుండు వంశ వద్ద౯ నుండు ధమ్మ౯
వినుండు రేవన ఒంబర వెల్లి నాగ
బంధమున విల్చి పుట్టెండు వం(ట్టి)[1] పొలము
గెలుపు మిగుల సఖణ్డుప్రదీపమునకుం
దనరంగాం బెట్టె నాచంద్ర తారకముగ.

29. .


శ. స. 1133.


ఇది గుంటూరుజిల్లా గుంటూరు తాలూకాలోని ఇప్పటము గ్రామములోని మల్లే
శ్వరస్వామియాలయము నెదుట నున్న యొకఱాతిమీఁద నున్న ది- (A. R. 88 of 1917)

సీ. శ్రీశక రాజభిశేక వత్సరములు
పురరామచంద్రభూపరిమితముగ
నమరంగ్గం బౌష్యమాసమున పంచ్చాదశిం
గమలాప్తదినమున విమలధమ్మ౯
మతి న్రిపచారిత్ర నుతికెక్కు గండ్డభూ
పతిసుతుండ్డౌదాయ్య౯ మతిం దలంచి
సమ్మతుండై కోట ముమ్మడి దేవన
రేంద్రుండ్డు విభవసు రేంద్రసద్రిశుం
డభిమతాత్థధమ్మ౯ విభవశాయ్యో౯న్నతిం
దనరి వెలుంగ నిచ్చె మనుచరిత్రుం
డవని దేవతలికి భువి దాన మేప్ప౯డం
దరణి రజనికరసుతారముగ.

.....................................................................................................

  1. ఈశబ్దము రూపము సందేహాస్పదముగా నున్నది.