Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసన పద్యమంజరి

21


చం(ది)రు[1]దేవణ్డు దండ్డెమాంబికకును
            శ్రీయుతు ణ్డెఱ్ఱమనాయకునికిం
గౌరికి[2]పుత్రుణ్డు గొమరుగాం దనభార్య్య
            ముప్పమకును ధర్మ్ము వొప్పుచుణ్డ
సంద్ధియ[3]దీపంబు శాశ్వతంబుగం బెట్టెం
            గొలనిసోమేశున కెలమి వెలుంగం
చెలువుగాంగ దీనిం జేకొని కన్నన
పండితుండు నడపుచుణ్డువారు
బెడంగుగా నాచంద్ర[4]
తారకముగ నెల్లవారుం బొగడ.

—————

28

శ. స. 1131(?)

ఇది గంజాముమండలము శ్రీకాకుళముతాలూకా శ్రీకూర్మములో కూర్మేశ్వరస్వామియాలయము ఉగ్రాణపుగది కుడిప్రక్కస్తంభముమీఁద చెక్కఁబడి యున్నది. (South Indian Inscriptions Vol. V. No. 1256)

సీ.

గగణగుణాత్మేంద్దుగణనశకాబ్దము
            లు [5] సనం చైత్ర[6]సితషష్టిశశిదినమున
నఖలసురాసురేంద్రానర్గ్ఘ(ము)కుటాగ్ర
            సద్రత్నరంజ్జిత(చ)రణుండైన

  1. "చందిరు" అన్నచో ఛందోభంగ మయినది. సరియైనపేరు తెలియదు.
  2. "గూరిమి" అని యుండనోపు.
  3. "సంద్దియ" అని యుండనోపు. ఇది సంధ్యాశబ్దభవము.
  4. ఈపాదములోఁ గొంతభాగము లుప్త మయినది.
  5. "ల్" అని యుండవలయును.
  6. స"నంజైత్ర" అని యుండవలయును.