| |
(ప)క్షత్రితీయ్యయు మేషసంక్రాంత్తినిమిత్తము(నం) వీరబలంజ్య
ధర్మ్మనిర(తుం)డు దాచ(నై)తమసెట్టి కబ్జాతనేత్రి గేతమాంబికకు
నుం బ్రీతితనూజుండు మహితగుణాఢ్యుండు మల్లిసెట్టి
భక్తి బె(ట్టె) నాండుం బల్లిహ(హరు)నకు నఖండదీప మాదరముగనే
యిరువ(ద్వి)నుమొదవులుం బ్రసిద్ధిగాంగ.
|
|
ఈపద్యమందు తప్పులు మెండుగా నున్నవి.
20
ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరులో మసీదుస్తంభముమీఁద చెక్కఁబడినది. (South Indian Inscriptions Vol. V. No. 184.)
| క. |
తరణిశివశకసమంబు(ల
స)రసి[1] సోమేశ్వరునకు సంధ్యదీప[2]
లిరుసంధ్యలం జనం గ్గాటయ
వరపుత్రుం డమాత్యయయ్తి(వర)౦గం బెట్టెను.
|
|
21
ఇది పశ్చిమగోదావరీమండలమున ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడి యున్నది. (South Indian Inscriptions Vol. V. No. 189.)
| చ. |
గురుమతి మంత్రి శ్రీధరునకుం గ్గొసనాంబకు నంద్దనుణ్డు సు
స్థితుండగు[3] భీమశౌరి సరసీపురి (నొ)ప్పిన సోమనాథదే
వరకు నఖణ్డదీపము ధ్రువంబుగ నేర్ప్పడ్డం బెట్టె రోహిణీ
శ్వరకరకైరవాప్తశశిసంఖ్యశకాబ్దము లుర్వ్విం బర్వ్వంగాను.
|
|
- ↑ "సరసీ" అని యుండనోపు.
- ↑ "సంధ్యాదీపం" అని యుండవలెను
- ↑ "స్థిరుండగు" అని యుండవలెను.