పుట:Shaasana padya manjari (1937).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనపద్యమంజరి.

15

16

శ. స. 1094

ఇది గుంటూరుమండలము పాములపాడు గ్రామములో మల్లి కార్జునస్వామి యాల
యము నెదుట నందినాగ స్తంభముమీఁద చెక్కబడియున్నది. (A. R. 122 of 1917.)

ఉ. పాముల పొటిమణ్డనకుం బంకరుహానన యేమమాంబకుం
గామనిభుండు గొమ్మన సుఖస్థితిం బుట్టి నిజాన్వ వాయసు
త్రాముం డు దల్లిదండ్రులకు ధమ్ము౯తావుగాం దనవృత్తిపై గ్రహ
గ్రామణిం బోల దీపక మఖణ్డితమై మహిం బన్వి౯ యొప్పంగాను. 1

క. సరధి[1] 'నిధి ఖేందుసక [2]వ త్సర సంఖ్యలం గాత్తి౯కా (ము)న దవలిమ పూన్న౯ - స్థిరగురుదినమునం గొమ్మన యురుతరదీపంబు శివున కొప్పంగ నిల్పెను. 2</poem>

17.

శ. స. 1094

ఇది గుంటూరుమండలము పాములపాడులో మల్లి కార్జునస్వామి యాలయము నెదుట నంది నాగ స్తంభముమీఁద చెక్క (బడినది. (A. R. 120 of 1917.)

ఉ. కామనిభుణ్డు భీమనకుం గామవసాంకిం*[3] బుట్టి బంధుచిం తామణి యైన కొణ్డుం డు చిత(ం) బుగం బాములపాట సజ్జన స్తోమనుతిం బ్రదీపకము ధూజ్జటి కెత్తె నఖండవత్తి౯ యు. ద్దామయ ప్రకాశి దమతల్లికిం దండృకి *[4] ధమ్ము౯గా వేప్ప౯డను.1</poem></poem>

.....................................................................................................

  1. శరధి- అని యుండవలెను.
  2. .శ. అని యుండవలెను.
  3. సానికిం. అని యుండవలెను.
  4. దండ్రికి - అని యుండవలెను.