Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14.

శారనభభ్యమంజరి.

14

శ. స. 1094

ఇది గుంటూరుమండలము గుంటూరుతాలూకా పాములపాడులో మల్లికార్జునస్వామి యాలయమున కెదుట నందిస్తంభముమీఁద చెక్కబడినది.(A. R. 124 of 1917.)

ఉ.

శ్రీమహిలాభిరాముండు విశేషితకీర్త్తుండు గొమ్మం దర్త్థిచిం
త్తామణి దల్లిదండ్రులకు ధర్మ్మువుగా శివధర్మ్మయుక్తుండై
పాములపాట నొప్పంగం గపర్ద్దికి సజ్జనసంస్తుతంబుగా
ధీమణి వెట్టె నాత్మకులదీపక మైన యఖణ్డదీపమును.

1


ఉ.

చారుతరాబ్ధినంద్దఖ(ని)శాకరసంఖ్య శకాబ్దము ల్సనను
ధీరుండు గేతనాత్మజుండు ధీనిధి వాములపాటం గొమ్మం డి
ద్దారుణి నామృగాంకరవితారకమై చనం బెట్టెం బెంప్పున
న్మేరువు యుత్తరాయణనిమిత్తమునందు శశాంకమౌళికిని.

2

—————

15

శ. స. 1094

ఇది గుంటూరుమండలములోని పాములపాడుగ్రామములోని మల్లికార్జుస్వామి యాలయమునెదుట నందినాగస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 123 of 1917.)

ఉ.

శ్రీజననాలయుండు బుధసేవ్యుండు వేముండు సద్గుణుండు మా
తాజనకద్వయంబునకు ధర్మ్మువుగా శశిమౌళిధర్మ్మి యై
రాజితచంద్రమౌళికిం దిరంబుగం బాములపాటం బెట్టె స
త్పూజితమై మహిన్నెగడం బొల్పగుచున్న యఖణ్డదీపమును.

1


ఉ.

వారక యానిశాకరదివాకరమై చనంగా శకాబ్దములు
ధారుణి వార్ద్ధినంద్దదివితారకనాథమితంబుగా మహిని
గౌరత నుత్తరాయణము గారమై యెఱగాంక్కపుత్రుం డు
త్సాంతదోషపుంజము విచారపరుణ్డు ధరాతలంబునను.

2

—————