2
ఇది గుంటూరుజిల్లా సరసారావుపేఁటతాలూకాలోని తూపాడుగ్రామములో వినాయకుని యాలయము గర్భగుడిసమీపమున నిల్పఁబడిన నాగశిలమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 441 of 1915.)
క. |
శ్రీసహితుండు దూంబఱితిసు
శాసనుం డనియంకభీము చక్రము లీలా
వాసుండు సతుర్త్థ[1]కులగిరి
కేసరి గాపండు జగజ్జిగీషుండు పేర్మ్మిని.
| 1
|
చ. |
అడపయు నందలంబు వివిధాతవారణకాహళావలిం
బడియము నాదిగాంగల న్రిపాలకచిహ్నలు బుద్ధవర్మ్మచేం
బడసినవాడు నాయకసభామణి సి(ద్దప)నాయకాంకుం డి
ప్పుడమిం దదీయవీరభటపుంగ్గవుమనుమం డుదాత్తసంప్పదను.
| 2
|
క. |
సేవనియు సింగనయు జగ
దేవండుం (జోడ్ల)నుం[2] జూడ దీరిక మండ
క్ష్మావలయేశ్వరుపన్పునం
బావని రఘునాథుచేతం బనివడినక్రియను.
| 3
|
శా. |
తన్నగ్గించుచు నెఱ్ఱమండణ్డు బుధాధారుండు పన్పంగ న
మన్నే(ట)౦గనయంబుల న్రిపులకు న్మార్ప్పెట్టి యోడించ్చి పే
ర్కొన్న న్మణ్డనగంధవారణసమాఖ్యుం జేసి తూంబఱ్తిపై
నెన్న న్వ్రిత్తిగ నాతుకూరు దయతో నిచ్చె న్నిజస్వామియును.
| 4
|
చ. |
శకసమసంఖ్య వారినిధిసాయకఖేంు మితంబుగాంగ గా
ర్త్తికసితపక్షతేరసముం దీవ్రకరాము[3]నం దఖండదీ
|
|
- ↑ "చతుర్త్థ" అని యుండవలెను.
- ↑ ఈయక్షరములు స్పష్టముగా లేవు.
- ↑ "దీవ్రకరాహము" అని యుండనోపు.