Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసనపద్యమంజరి

ద్వితీయభాగము

—————

1

శ. స. 1046

ఇది గుంటూరుజిల్లా నర్సారావుపేఁటతాలూకాలోని నాదెండ్లగ్రామములో నొకపొలములోఁ బడియున్న ఖిన్నమయిన యొకఱాతిమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 395 of 1915.)

శా.

శ్రీమద్ధర్మ్మపరాయణులు బుధజనాశీర్వ్వాదవంతులు దయా
ధాములు సర్వ్వజనానురక్తు లఘవిధ్వస్తాత్ము లుద్యద్యశో
రామారాములు వైశ్యవంశులు[1]గుబేరప్రాభవులు గోమినీ
భామాధీశపదాబ్దభక్తులు జగత్ప్రఖ్యాతతేజోధికులు.

1


ఉ.

లాలితవిత్తదాన్వయలలాముణ్డు పుణ్యయశోధనుణ్డు మొ
క్కోలకులోత్తముణ్డు పెనుంగొణ్డవిభుణ్డు ప్రభుణ్డు సత్యవా
క్శీలుణ్డు ధారుణిం గొసనిసెట్టికిం బ్రోలమకును సుతుణ్డు ల
క్ష్మీలలనేశ్వరస్తరణసేముషి గోమనయును ముదంబుతోను.

2


మ.

ధరణీశోత్తము ణ్డైనశ్రీశకనృపాబ్దంబులు రసోదన్వదం
బరచంద్రస్థితసంఖ్య మాఘసితశుంభత్పంచమిం బార్వ్వతీ
శ్వరు విశ్వేశ్వరు భక్తితో నిలిపి విశ్వస్తుత్యులై దేవమం
దిర మెత్తించిరి వంశవర్ద్ధనులు (నాది)ణ్డ్లం జిరస్థాయిగాను.

3

—————

  1. "వంశ్యులు" అని యుండవలెను.