పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

శ తావ ధా న సారము, వూ ర్వార్థము

జయ సం॥ కార్తీకములో ధవళేశ్వరములో జరగిన యష్టానధాన పద్యములలోఁ గొన్ని, (అగస్త్యేశ్వరుఁడు)

ఉ॥ శ్రీరుచిరప్రభావ మునఁ జెన్న లరా రెడి గౌతమీనదీ
తీరము నందు నివ్వటిలి దీనుల సందఱి వేడ్కఁ బ్రోచుచుఁ
గారణ దేహుఁడై తగియగస్త్య మహామునిరాహేతిష్ఠితుం
డై రహిమీఱు దేవు ధవళాచల నాసు నుతింతు నిచ్చలు న్1

(సమస్య) కలహపుదుంప భూమిపయిఁ గామినిగాదె తలంచి చూచినన్

.

చ॥| కలకలనవ్వు నా మొగము గన్పడఁ జేయుచు గబ్బిగుబ్బల
గులుకఁగఁ జేసినంతన దిగుల్పడి యెంతటినీతిశాలియు
వలచును దాని నద్ది పెఱవానినిఁ గూడిన వానిఁ జంపు నౌ
గలహాపుదుంప భూమిపయిఁ గామినిగా దె? తలంచిచూచినన్ 2

శ్రీ. శ్రీ. శ్రీ.

మరల నమలాపురములో ఒక యష్టావధానము జరిగినదిగాని ఆది కార్డు దొరకదయ్యె.


జయ సం॥ మాఖమాసములో బెజవాడలో జరగిన యవధానములో జెప్పినపద్యములు 50 టీలోఁ గొన్ని, (నవ నాగరికులు. }

సీ||వైదిక గీతి చే వఱలు వారలఁ జూచి కోర్కె మైఁ జప్పట్లు కొట్టు నొకఁ
డు | సంధ్యానమస్కారచర్య మానినవారిఁ గాంచి యాసం దమ్ము
గాంచు మెుక డు వచనకవిత్వము రచియించు వారలే మేలు మే
లనీ చెప్పిసోలునొకఁడు | ముండనం బొనరించి ముండలవలె నుండు
బార లేమేలని పల్కు నొకఁడు,
తేగీ||మడినిఁగట్టక యే భుక్తి గడపు వారు
యోగ్యతము లంచు మదిలోననుబ్బు నొ క్క
పెట్టి నవనాగరికులతీ రెన్న దరమె
యహహ యిది యెల్లఁ గలికాలమహిమగాదె.3

జల్లెడు అనుష్టుప్

.

తుషాపన మనే దక్షాసహస్రనయ నోపమా

వేణు కశ్మీరి తా సేయం | చలనీ భాతి సుందరా.