కాకినాడ.
5
(లక్ష్మి) మత్తేభము..
కలధౌతాంబరు దేవి నామనముగఁ గాంక్షింతు నెక్కాలమున్
గలధౌతోజ్జ్వలదంగ విభ్రమకళాకళ్యాణజాలాస్పదన్
గలధౌతోదర ముఖ్య నిర్జరమసఃకంజాతసూరాయితన్
గలధౌతాదిధనాభిశోభితమహాగా రావళీ వాసినిన్{{float right|16}
.</poem>
(కఱపు) శార్దూలము,
ధారాపాతము లేక సస్య వితతుల్ తప్తము లయ్యె గడున్
జేరెన్ సర్వజనంబు నీ పురము నే జీవింప, వారందఱిన్
శ్రీరామేశఘనుండు ప్రోచి మును దా శ్రీవృష్టినాక్షామమున్
బాజ దోలెను దానిఁ గోర మరలన్ బాగెట్లగుఁన్ దెల్పుమా17
</poem>
(కావ్యము) స్వగ్విణి.
సార రాజన్యుల జక్క మెప్పించుచున్
జారువాక్చిత్ర విస్తార పద్యములన్
సూరిచేతోలసత్సూన సౌరభ్యమై
మీఱుకావ్యమ్ము నెమ్మిన్ బ్రశంసిం చెదన్.18
</poem>
(వేశ్య) భుజంగ ప్రయాతము.
చలాపాంగ దృష్టి ప్రసారము చేతన్,
విలాసమ్ములఁ జూపివిత్తమ్ము లాగున్
గలావీద్విరాగి ప్రకాండము నైనన్
గలంచున్ భువిన్ విత్త కాం తాజునంబౌ19
</poem>
చంద్రోదయము) ఉత్పలమాల.
శ్రీరమ గేహముల్ గునుకఁ జేయుచుఁ గోకములన్ గలంచుచున్
జారుచకోర సంతతులఁ జక్కఁగ వెన్నెల నాదరించుచున్
మారునకున్ సహా యఁడయి మానీనులన్ గలగంగఁ జేయుచున్
మీఱెడుఁ జంద్రు డుజ్జ్వలతమిస్రమహీధరవజ్రవజ్రమై,20
</poem>
..........................................................................................................
ముంబట్టి ప్రకటించును, శతఘంటకవిత్వము - చెప్పుట మిగుల నరుదైన కార్యము ఈ యాంధ్రదేశమ్మున నిట్టిపనులు చేసెడివారిలో, సిద్ధులు. శ్రీమాక్ మాడభూషి వేం కటాచార్యులవారును బ్ర. శ్రీ దేవులపల్లి సుబ్బారాయుశా స్త్రీ తమ్మన్నశాస్త్రి గార్లును