Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారద లేఖలు సంతోషింపుచున్నా"నని చెప్పియున్నాడు. ఖద్దరు వస్త్రము లను ధరించుటయనగా నిరుపేదలకన్నమిడుట యన్నమాట.విూశరీరములు స్వదేశీయములేగాని విూరు ధరించిన వస్త్రములు మాత్రము స్వదేశీయములుగా లేనట్లు కన్పట్లుచున్నది. కాన విూరందఅు నూలువడికి స్వదేశవస్త్రముల ధరింపవలెనని కోరు చున్నాను."

       మిత్రమా, సరోజినీదేవి యుపన్యాసమునందలి ముఖ్యాం శము లివియని జ్ఞాపకము. వీనిలో నేదైన పొరపాటులున్న సదినావియేయని యెంచుము. మేము వేసవిని చల్లగఁ గడుపవలెనని యిచ్చట కేతెంచితిమి. ఇచ్చట యొండలు తక్కువ. వేడిగాడ్పులసలే లేవు. చెమట పోయుటయేకానము. ఈదినము లలో మన ప్రాంతములనుండెడి మండు యెండలు, వేడిగాడ్పులు, చెమట స్నానములు, తనియని దాహములు తలఁచుకొని యిూ యూరి యొండలను తలంచినప్పుడు యేపుష్యమాఖమాసపు యొండలుగనో గాన్పింపుచుండును కాని యిూ యెండలకే అడలి పోవుచున్నా రిచ్చటినారు. చూచితివా చిత్రము!
     భావపురి                                                  నీప్రియమైన
 1928 జూలై                                                     శారద.