పుట:Saptamaidvardu-Charitramu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా ల న ఆ ధ్యా యము

61


దుగఁ నేగి మతగురువు నాససంబునకు నుత్తరపు జాయ నమర్చిన గదిలో నున్న తాసనంబునఁ గూర్చుండి. తనయుని వైహి హిక క్రియలు నడుచుటను జూడఁ గోరు చుండెను.

పెండ్లి కూతువంక నా కొకచాయనుండి.గుడిఁ బ్రవే శించిరి.l. మంత్రులు మహారాజులు మున్నగువారు రాజు పెడ్డిని గన విచ్చేసిరి. ఎడ్వర్డు ఒక బండిలో నెక్కెను. .. యల్లుడు ఆయన కిరు కెలంకులఁ గూర్చుండిరి. ఆయనబండి మ్రోల సాయుదు లై నపరిజను లశ్వంబుల నారోహించి ముందుఁ జను చుండిరి. ఠాణాదారులు సామాన్యజనులను జేర నియ్యక దూరమున నుండుడని 'బెత్తంబులచే వారితలల పై నాడించు చుందిడిరి. . అలెగ్జాండ్రా వేరొక బండి నెక్కి కడలి బిడ్డ "వెన్ను ని జెందఁ బోవుపగిదిఁ గనుపట్టె. ఆమె చెలికత్తియ లామె కెలఁకులు నుండిరి. ఇటల నారాజవధూవరులు మెల్లగ రాజవీథిని ఠీవిగ జని దేవాలయమును బ్రవేశించిరి. జనులయానందముసకు మేర లేదు. వారు తమ సంతోషముఁ బెక్కు తెరంగుల నెఱిగిం చిరి. కొందురు చప్పుట్లు తట్టిరి. మఱికొందరు కోలాహల ధ్వనులు నింగి:ముట్ట: చేసిరి, భేరీ మృదంగాది 'వాద్యములు మ్రోసె. వందిమాగధులు రాజు బిరుదులను బాడి కీర్తించిరిl. అప్పు డా కోవెలచుట్టు నిసుక వేసిన రాలనం తజనసమూహము లాసమయంబున నుండిరి.

ఇంతలోముహూర్త కాలము సమీపించెను. చప్పుడడం