పుట:Saptamaidvardu-Charitramu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

సప్త మైడ్వడ్డు చరిత్రము.


నలునై పుల బలిసి కొలువ పెండ్లి వారు నాలుగు గుఱ్ఱంబులు పూన్చీన బండ్లపై నెక్కి. 'రాజు మార్గంబున రాచ ఠీవినిరా బొడగిరి.మేడ చివరలమీఁద నుండిన నారీమణులు పూలవానను అలె గ్జాండ్రా ప్రభృతుల పై గురిపించిరి , శ్రీమంతులు ముత్యాల వర్షమునారాజ మార్గము మీఁద బోరస వర్షింపించిరి, అనేకులా యాఘట్టములలో వారిని నిలిపి, నానావిధమణులచే నలంకరింపబడిన సింగంపు బీఠముల పైఁ గూర్చుండఁ జేసి వారిని బహుభంగులగౌరవించి. లండను వంతెన చెంగట బూలచే నలంకృత మైనమంటప మొకటి యమరి యుండెను. అందు నెడ్వర్డు అలెగ్జాం డ్రాలు విశ్రమింప దివ్య మణిమయో పేతంబు లైన తిన్నెలువేసి యుండెను. వాని పై నాయాప్రభువులకు నుచితాసనములు రాజల్లు చుండెను. వాని నడుమఁ జక్కగ నలంకరింపండిన యున్న తాసనములు రెండు చూపఱుకు గనుపట్టు చుండెను. లుడను పుర పాలక సముదాయము( Londlon Municipal Cor-poration) అయాసనంబుల పై నాయ" రాజవర్గములు గూర్చుం డ నేర్పాటు చేసిరి. అంత నాసంఘమువారు ఆలగ్జాండ్రా ”ను బహురీతుల సంభావించి, స్వాగత మిచ్చిరి. పెండ్లి వారాచోటువాసి, కైతునెసు ప్రభువు దోలిన. ధూమశకటంబుపై వింజరుభవసము సమీ పించిరి. ఈటను పాఠశాలలో జదువు బాలు రెనమన్నూరుమంది ఆగ్జాండ్రా"ను నాయమ తల్లి దండ్రులను సగౌరసంబున తమపురికి విచ్చేయవలయు నని ఆహ్వానము సేసిరి. వింజురు