పుట:Saptamaidvardu-Charitramu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము.

21


ల్ గుభాల్ అని మ్రోగెను. గుడులలో ఘంటలు వాగెను.అనేకులు పెక్కు రీతుల జప్పట్లు తట్టి, తమ సంతోషమును తెల్పిరి. మతగురు వీ తెఱంగున 'రాకొమారునకు జ్ఞానస్నానమాచరించెను. నాటి సాయంకాలమున విదేశములయందుండి విచ్చేసిన రాజు బంధువులును, 'రాణిమంత్రులును, మతా చార్యులును, మొదలగువారు రాణిగారు చేసినవిందు నారగించి, తమతమ వీడులకు వేంచేసిరి.

ఎడ్వర్డును లేడి లిటల్టన్ పెంచుట,

ఎచ్చట నైనను శ్రీముతులలో లేక లేక పుత్రుఁడుపుట్టి పుట్టక ముందే వాన్ని తల్లిదండ్రులు నానికి బలుపలుకుల నేర్చుటకుఁ గోరు చుంచుదురు. శ్రీమహాచక్రవర్తిని బిడ్డని విద్యావిషయ మై వేఱుగ వచింపవలయు నా ?శ్రీరాణీగారును,ఆయముభర్తయును, తమసీమ తపుత్రు: బెంచుటకును, అతనికి దగినవిద్యాబుద్ధులను గఱపుటకు సర్హులైన ఉపాధ్యాయుని వెదకుటకు నారంభించిరి. రాణి రాచకార్యము "నర్పవలసి యుండె. ఆ యిల్లాలు డవబిడ్డలను బెంచుటకుఁ జాలినంత కాలము లేదు. పుట్టి సబిడ్డడు సామాన్యులకుఁ బుట్ట లేదు. అతఁడు ప్రపంచములోఁ బంచమాంశమునకు నేలికయగుసట్టి వాడు. అట్టీడు దుష్టుల పొత్తునఁ జేరక, మెలఁకువబెరుఁగవలసి యుండె. ఆంగ్లేయ దేశాచార వ్యవహారములాత ను 'బాగుగ నెఱుంగవలసియుం డె.. వారి మతస్వభావ