పుట:Saptamaidvardu-Charitramu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమైడ్వెర్డు చరిత్రము


సంప్రొప్త మయ్యేను. ఎడ్వర్డు వెంటనే ఫ్రాన్సు దేశమునకు నెళ్లి తమ్మునీశవమును గొనివచ్చి వింజరు భవనంబున సమస్త రాజు చిహ్నములతోఁ బూడ్పించెను.

ఎడ్వర్డ లెగ్జాండ్రాలు అయిర్లెండునకు వెళ్లుట

,

ఎడ్వడ లెగ్జాండ్రాలు అయిర్లండునకు వెళ్లుదు రని పత్రి కలు చాటింపసాగెను. అయిర్లం జనులును, అమెరికా ప్రజలును, తమదొరను దొరసానిని జూచుటకుఁ బ్రముదిత చిత్తులై యుండిరి.

అయిర్లండు జనులలో రెండు తెగ లున్నవి. మొదటి తెగ లో “నాషనలిస్టు, అనువారు చేరి యున్నారు. వీరు బలవం తులు. వీరికీ దేశాభిమానము సంపూర్ణముగను నుండును.. వీరు ఇంగ్లండు దొర తమ్ముఁ బాలించుట సాధారణముగ నొల్లరు. రెండ వ తేగవారు ఇంగ్లండుదొరయే తమ్ము బాలింప వలయు నని కోరుచుండువారు. వీ రెల్లప్పుడును దొరతనము వారి నాశ్రయిం చుచు వారివలనఁ దమ బ్రతుకు తెరువు గనుచు, వారిచ్చు బిరుదు లచే నల కృతు లగుచు, ఉండువారు. ఇట్టివారు 'మొదటి తెగ " వారితో గలియ రనుట నిర్వివాదాంశ మే..

మొదటికక్ష వారి పక్షముస నోక వార్థాపత్రిక ప్రచుర మగు చుండెను.ఎడ్వర్డు ప్రభృతు లైర్లండు నకు వచ్చుటకు సిస్ట పడ మని తమప త్రికలో ప్రచురము సేసిరి. మణికొందఱు వారి రాక విషయమై ఉదాసీనులై యుడిరి. ఇంకఁ గొందఱు ఎడ్వర్లును,