కాటన్, సర్ ఆర్థరు థామస్ ら వర్గములతో వాదించి, కాటకా వారిని ఒప్పించి, నీటి పారుదల సౌకర్యములను కలిగించు ప్రయత్నములను ఆచరణములోనికి తెచ్చెను. మొట్టమొదట తమిళనాడులోని కావేరి, కొలరూ!" అను నదులమీద ఆనకట్టలను కాటూ నిర్మించెను. వీటివల్ల వరదల ప్రమాదము తొలగిపోవుటేగాక తిరుచ్చిరపల్లి, తంజావూరు జిల్లాలకు నీటిపారుదల వసతు లేర్పడినవి. ఈ రెండు ఆనకట్టలు 1988 లో పూర్తిచేయబడినవి. ఇ3: గాక కొలరూ: నదిపైన 70 మైళ్ళు దిగువగా మరొక ఆనకట్టను నిర్మించి దక్షిణ ఆర్కాటు జిల్లాకు కూడ కాట. నీటివసతులు కల్పించెను. సంగ్రహ ఆంధ్ర ఆ తరువాత పెన్న నదిమీద నెల్లూరుదగ్గర ఆనకట్ట నిర్మాణమునకై కాట కృష్ణ గావించినాడు. నెల్లూరు ప్రాంతము ఇందుమూలముగా ధాన్యాగారముగా ప్రసిద్ధి ప్రాంతపు ప్రజలు సుఖించుచున్నారు. పిమ్మట పాలార్, డియార్, వెల్లార్ అను నదులమీద కూడ 1.ఆనకట్టలు నిర్మించుటకు అతడు కృషి గావించినాడు. గోదావరి, కృష్ణా, కావేరీనదులకంటే ఇవన్నియు చాల చిన్నవి. అయినను, వీటివల్ల కూడ ఆయా ప్రాంతీయ క్రజలకు తామవాధ తొలగిపోయినది. మధురజిల్లాకు జీవన ధాత్రియైనది పెరియార్ నది, పెరియార్ ప్రాజెక్టుకు కూడ ప్రణాళికను తయారుచేసినది కాటూ మహాశయుడే. 1877 6 ఆంధ్ర, దక్షిణ గోదావరీనదికి ఆనకట్ట పథకము 1845 లో తయారు చేసి ఇతడు మద్రాసు ప్రభుత్వమునకు సమర్పిం చేను. ధవళేశ్వరము దగ్గర ఈ ఆస కట్టను కట్టదలచినచోట మొత్తము పొడవు 6287 గజములు. కానీ సదిమధ్య మూడు అంక లుండుటచే నిర్మించవలసిన ఆనకట్ట మొత్తము పొడవు 3946 గజము లే. ఇది బ్రహ్మాండ మయిన పనియే! గోదావరీ ఆనకట్ట నిర్మాణము 1847 లో ప్రారంభ మయినది. ఐదేండ్లలో (1852) ఆన కట్ట నిర్మాణము పూర్తి అయినది. ఈ లోగానే కాలువల త్రవ్వకము పనులుకూడ పూర్తి గావింపబడినవి. సర్ ఆర్థర్ కాటన్ దిగువ గోదావరి ప్రాంతములో కరపురాకానికి ఉద్వాసన చెప్పబడినది. లో కృష్ణానదిమీద బెజవాడవద్ద ఆనకట్టకు పథకము తయారుచేసినవాడు సర్ హెన్రీ అట్వేల్ లేక్ అను నాతడు, ఆ పథకమును కాటకా బలపరచినాడు. సర్" లేక్ ప్రారంభించిన కృష్ణ ఆనకట్టను చార్లెసు ఆర్ పూర్తి గావించినాడు. ఈ చార్లెను ఆర్' అను నాతడు కాటకొకు శిష్యుడే. కృష్ణానది ఆనకట్ట నిర్మాణము కూడ కాటజా సలహాలతోనే పూర్తి అయినది. దీని నిర్మాణకాలము 1852-1865. జిల్లా అతో మహాక్షామము వచ్చినది. "డొక్కల కరవు" అను పేరుతో ఇది ప్రసిద్ధమయినది. ఈ కరవువల్ల 77 లక్షలనుంది చనిపోయిరి. అయితే ఈ రకపు బాధలు నీటి పారుదల సౌకర్యము లున్న ప్రాంతములకు' ఏమాత్రము సోకలేదు. అంతేగాక, ఆనకట్ట లున్న జిల్లాలనుంచి ఆహార పదార్థములను కరపుచే పీడితము అయిన ప్రాంతములకు పంపుటకు అవకాశము కలిగినది. ఈవిధముగా కాటన్ మహాశయుడు దీర్ఘ దృష్టితో నిర్మించిన ఆనకట్టలవల్ల అసంఖ్యాక జనులకు మహోపకారము జరిగినది. 1882 లో కాటన్ పదవీవిరమణ గావించెను. కాని, అటు తరువాత కూడ ఇతడు ఇంజనీరింగు సలహాదారుడుగా పని చేయుచునే యుండెను. కృష్ణపై కర్నూలు దగ్గర ఆనకట్ట నిర్మాణమునకు ఆయన పథకము వేసినాడు. కాని ఆయన ఉద్యోగకాలములో అది జరుగలేదు. తరువాత ఈ ఆనకట్ట విషయములో ఆయన సలహాలను ఇచ్చుచునే యుండెను. దీని నిర్మాణ విషయమై శ్రద్ధ వహించినాడు. కర్నూలు సమీపములోని సుంకేశులదగ్గర ఆనకట్ట తయారయినది. కానీ ప్రాంతపు ప్రజలు నీటిని వాడుకొనక దాని యుపయోగము సరిగా పొందజాలకపోయినారు. 634
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/683
స్వరూపం