విజ్ఞానకోశము -౨
ఆసియా
అంతగా నీరు అవసరము లేదు. సముద్రము యొక్క ఒడ్డున ఇసుక నేలలో సర్విచెట్లు పెరుగును.
(i) ఆసియా తూర్పుభాగమున 30° - 45° ఉత్తర అంశముల మధ్య ఉండెడు ప్రాంతములో సమశీతోష్ణ ఋతుపవన మండలములకు చెందిన అడవులు కలవు. ఇచ్చట శీతోష్ణస్థితి ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణస్థితికంటే స్వల్పముగా భిన్నమై యున్నది. ఈ ప్రాంతమునందు అడవులు దట్టముగా పెరుగును. ఇవి ఏకాలములోను ఆకులను రాల్చవు. ఎల్లప్పుడును పలుచని ఆకులను కలిగి యుండును. చెట్ల మ్రానులు లావుగాను, ఆకులు చిన్నవిగాను, బెరడు ఒకమాదిరి మెత్తగాను ఉండును. ఓకు, నేంపర్సు, నుగ్నో లియాస్, కామిల్ల ను, బీచెస్, లారెల్సు అనునవి యీ అడవులలో ముఖ్యమైన వృక్షములు. ఈ అడవులు చైనా, జపాన్ దేశములలో కలవు.
(4) ఆసియా తూర్పు భాగమున 45°-60° ఉత్తర అక్షాంశము మధ్య శీతల సమశీతోష్ణ మండలపు అడవులు కలవు. మంచూరియా, తూర్పు కొరియా, ఉత్తర జపాన్, ఉత్తర చైనాలు ఈ మండలములో నున్నవి. ఈ మండలములో త్రిభుజాకార పత్రపు అడవులు కన్పించును. ఓక్, ఆల్టర్, బీచ్ మొదలగునవి ఈ అడవులలో ముఖ్యమైనవి. వీటి కలప చాల శ్రేష్ఠమైనది.
(5) ఆసియా నైరృతి భాగమున 20° - 30° ఉత్తర' అక్షాంశముల మధ్య ఎడారి ప్రాంతము కలదు. ఈ ఎడారులలో వర్షపాతము చాల తక్కువగా ఉండుటచే ముండ్ల పొదలు విస్తారముగా పెరుగును. కేక్టస్, అగేల్ వృక్షములు ఎడారులలో కలవు. కేక్టస్ మ్రానులోను, అగేల్ ఆకులలోను నీటిని దాచుకొనును. ఖర్జూర వృక్షము అక్కడ చాల ప్రాముఖ్యము కలది. ఈ ఎడారులలో నుండెడు “ఒయాసెస్” ప్రాంతములలో పంటలు పండించేదరు. ఆ ప్రాంతములలో పల్లెలు కన్పడును.
(6) ఆసియా పశ్చిమ భాగమున 30-45° ఉత్తర అక్షాంశముల మధ్య శీతోష్ణమండలారణ్యములు కలవు. ఇది మధ్యధరా ప్రాంతము. ఈ మండలమందలి వృక్షములు ఆకులను రాల్చక సంవత్సరము పొడుగునను పచ్చని ఆకులతో ఒప్పుచుండును. ఆరిన్, అత్తి, మల్బరీ చెట్లు ద్రాక్ష పండ్ల తీగెలు ముఖ్యమైనవి. చెట్ల ఆకులు చాల దళసరి గాను, నునుపుగాను ఉండును. ఆకులు దళసరిగా ఉండుట వలన ఆకులనుండి నీరు త్వరితముగా ఆవిరికాలేదు. కొన్ని రకములయిన చెట్ల ఆకులపయి ఒక రకమైన జిగురుపదార్థము పూతపూయబడినట్లు ఉండును. దీనివలన కూడ నీరు ఆవిరియగుట అరికట్టబడును. ఈ అడవులలో లభ్యమగు పండ్లన్నియు సబ్బు, ద్రాక్ష సారాయి, పట్టు మొదలయిన పరిశ్రమలలో విరివిగా నుపయోగపడుచున్నవి.
(7) ఆసియాఖండపు మధ్య భాగమున 30° 45° ఉత్తర అంశముల నడుమ సమశీతోష్ణ మండలపు గడ్డిభూములు గలవు. ఉష్ణోగ్రతల వ్యత్యాసము అధికముగా నుండును. వర్షపాతము తక్కువగా నుండుటవలన వృక్షములు పెరుగ జాలవు. గడ్డి మాత్రమే పెరుగును. ఈ గడ్డి భూములను "స్టెప్పీ" లందురు. ఇవి సై బీరియా నైరృతి దిశయందును, మంగోలియా యెడారికి సమీపమునందును, మంచూరియా పల్ల పుభూములలోను కనబడును. ఈ గడ్డి వ్రేళ్ళు లోతునకు పోవు. ఆకులు చాల సన్నముగా నుండును. గడ్డి నేలను పూర్తిగా ఆవరించియుండదు. ఉత్తరమునకు పోవుకోలది ఈ మండలమునందు గడ్డి దట్టమగుచుండును. నైరృతి, దక్షిణ ప్రాంతములకు పోవు కొలది గడ్డి పలుచ పలుచగా అక్కడక్కడ కనిపించును. ఈ ప్రాంతములను స్టెప్పీ ఎడారులందురు. ఇచ్చటి జనుల ముఖ్యవృత్తి పశు పోషణము.
(8) ఆసియా ఖండపు 45 - 66° ఉత్తర అక్షాంశముల మధ్యనున్న భాగమున ఖండాంతర శీతల సమశీతోష్ణమండలపు అడవులు కలవు. ఇది సమతల ప్రాంతము. ఉష్ణోగ్రతలు తక్కువగా నుండుటవలన నీరు ఎక్కువగా ఆవిరిగా మారదు. ఈ ప్రాంత మండలమందు ఎల్లప్పుడు పచ్చగా నుండెడి త్రికోణాకారపు అడవులు ఉన్నవి. ఇవి సై బీరియాలో నున్నవి. వర్షపాతము తక్కువగా నున్నప్పటికి ఉష్ణోగ్రత చాల తక్కువగా నుండుటవలన వృక్షములు పెరుగగలుగుచున్నవి. ఇక్కడ సరుగుడు చెట్లు విస్తారము పెరుగును.
(9) ధ్రువములనుండి ఆర్కిటిక్, అంటార్కిటిక్ వర్తులముల మధ్యనుండు ప్రాంతములు అతి శీతల ప్రదేశములు. ఈ ప్రాంతమును ఉత్తర టండ్రాభూము లందురు. ఇది చాల కాలము మంచుచే కప్పబడి యుండును. అడవులు