కన్నడదేశ చరిత్ర - II ఇట్టి సమయమున విజయుడు, కృష్ణుడు అను ఇద్దరు సోదరులు హదినాడునం దుండుట తటస్థించెను. వీరిద్దరు మైసూరు రిమైళ్లు 50 బొంబాయి 76° బిజాపూరు కృష్ణాన చితల్ దుర్ తుముకూరు మెంగళూరు బెంగుళూరు మైసూరు 40 కోలారు మద్రా 36 యదు వంశజులు. ద్వారక నుండి బయలుదేరి, దక్షిణమున నొక రాజ్య మేర్పరుచుకొనవలయు నని సంచారము చేయుచు హదినాడు వచ్చియుండిరి. ఈ సోదరులు హది నాడువారు తమ రాజకుమారి వివాహ విషయములో పడుచున్న దుర్భర పరిస్థితిని గమనించిరి. అంత సోదరు లిద్దరు హదినాడువారికి ధైర్యము పురిగొల్పి, వారికి సాయము చేయుదుమని బాసట చేసిరి. వారు కారుగహళ్ళి ప్రభువుపై దండెత్తి, వానిని మడియించిరి. విషమసమయ ములో సహాయముచేసి తమ వంశ గౌరవమును కాపొడి నందులకు రాజపుత్రిక కృతజ్ఞురాలై, సోదరులలో పెద్ద వాడగు విజయుని వరించెను. హదినాడు, కారుగహళ్ళి అను రెండును విజయుని స్వాధీనమయ్యెను. అప్పుడతడు "ఒడయరు" అను బిరుదు వహించెను. విజయుడే మైసూరు ఒడయరు రాజవంశమునకు మూలపురుషు డయ్యెను 502 సంగ్రహ ఆంధ్ర (క్రీ.శ.1899). ఈ మైసూరు రాజ్యము సహ్యపర్వతము లకును, కావేరినదికిని మధ్యగల ఎత్తయిన పీఠభూమిలో వర్థిల్లినది. వాడు రాజు ఈ రాజవంశమునందు 25 గురు 1309 మొదలుకొని 1958 వరకు, 557 సంవత్సరములు కన్నడ దేశమునుపరిపాలించి కన్నడ రాజ్యవిస్తీర్ణమునకును, భాషా సాహిత్యముల యభివృద్ధికిని, ధర్మప్రతిస్థాపనము నకును ఇతోధికముగ కృషి సలిపిరి. ఈ రాజ్యము విజయ నగర సమ్రాట్టులకు సామంతరాజ్యముగా నుండెను. ఈ ఓడయరులలో ఆరవవాడగు తిమ్మరాజ ఒడయరు II (1552-1571) విజయనగర సామ్రాజ్య పతనానంతరము (1565) స్వాతంత్ర్యము ప్రకటించి పరిమితమయిన కన్నడ దేశమును పాలించసాగెను. ఈ రాజులలో తొమ్మిదవ ఒడయరు (1578-1617), పన్నెండవ వాడగు కంఠీరవ నరసింహ ఒడయరు (1688-1859), పదు మూడవవాడగు దొడ్డ దేవరాజ ఒడయరు (1859-1872). పదునాల్గవవాడగు చిక్క దేవరాజ ఒడయరు (1872-1704) పేర్కొనదగినవారు. వీరు రణధీరులు, యశోవంతులు. కంఠీరవ నరసింహరాజ ఒడయరు తన పేరిట కంఠీరవ హొన్నులు, పణములు అను నాణెములను ముద్రింపించెను. మైసూరు రాజ్యసీమయందు హైదరాలివరకును ఈ నాణె ములు చెలామణి యగుచుండెను, ఈ రాజే మైసూరు నందు నేటికిని జరుగుచుండు దసరా ఉత్సవములను నేల కోల్పినవాడు. తపాలా చిక్క దేవరాజు వసతులను ఏర్పాటు చేసెను. నేల పన్నులను తగ్గించెను. దొడ్డదేవరాజు కాలములో మైసూరురాజ్యము తూర్పున సత్తెర పట్టణము మొదలుకొని నేలమువరకును, ఉత్తరమున చిక్క నాయ కుని హళ్ళి మొదలుకొని ధారాపురము (కోయంబత్తూరు జిల్లా) వరకును వ్యాపించియుండెను. చిక్క దేవరాజు కాలములో దక్షిణమున పళని, అన్నామలలు మొదలు కొని ఉత్తరమున మిడగేశి వరకును, తూర్పున కర్ణాటక ఘరము మొదలుకొని పడమట కొడగు బాలముల సరి హద్దులవరకును వ్యాపించియుండెను. పదునారవవాడగు దొడ్డ కృష్ణరాజ ఒడయరు 1 (1718- 1791) రాజ్యమునకు వచ్చునప్పటికి మొగలాయి పాదు షాలు దక్షిణ హిందూదేశము నాక్రమించి యుండిరి. .
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/547
స్వరూపం