Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒలింపిక్ క్రీడలు వాఙ్మయమును తనయొక్క రచనలతో విశేషముగా ప్రోదిచేసెను. పండిత వివాయక కవి రచించిన ఒరియా- సాహిత్య ఇతిహాసములో ఒరియాభసర ఇతిహాసమును, సూర్యనారాయణదాసు యొక్క ఒరియా సాహిత్య చరిత్రయు, అత్యంతముగా అమూల్యములైన రచనలు. 'ఆచార్య గిరిజా శంకరరాయకవి వ్రాసిన చరిత్ర గ్రంథము లును, ఒరియా వికాస నాటక చరిత్రమును, ఒరియా వ్యాకరణ చరిత్రయు, ఆధునిక విమర్శకులకు అనేకులకు మార్గదర్శకములుగా నున్నవి. చక్రధర మహాపాత్ర కవి వ్రాసిన జానపద గేయ పద్యము, కీర్తిశేషుడైన జలంధర దేవుడు పరిశోధనల గురించియు, ప్రయాణములను గురించియు వ్రాసిన కృతులును పాఠకులచే మిక్కిలి ప్రశంసింపబడినవి. ఇకముందు సాహిత్యము, అక్ష్యరహితమైనప్రయత్నము కాదు. ఆధునికములయిన పద్యములు, కథలు, వాస్తవిక మును, కాల్పనికమును అయిన వాతావరణములో నిండి యున్నవి. అసంఖ్యాక జనులయొక్క శ్రమలు, విశ్వాస రాహిత్యము, అశాంతి భయంకరమైన నేటి నాగరకతకు గౌణఫలములైన రైళ్ళు, టెలిఫోనులు, చలనచిత్రములు హోటళ్ళు, క్లబ్బులు మొదలగు విషయములన్నియు, ఆధునిక పద్యములలోను, కథానికలలోపు, నవలలలోను, నాటకములలోను, చిత్రింపబడుచున్నవి. ఈనాటి కవి ఆందోళనములు, మేళలు, అనంగీకార ప్రదర్శనములు అను జంఝామారుతములో సరథనముగా చిక్కుకొని పోయి, పద్యముల నల్లుచు, కథలను రచించుచు, తన కవితాశ క్తిని మానవాతీత సేవకై ధారపోయుచున్నాడు. ఒరియా వాఙ్మయ మెల్లప్పుడును, విశ్వసౌభ్రాత్రము కొరకును, స్వాతంత్ర్యముకొరకును పాటుపడినది. ఈనాటి రచయితలు పద్యగద్య రచనలలో సులభ శైలికొరకు మార్గములను అన్వేషించుచున్నారు. వివిధ విజ్ఞానశాఖలయందును భాషాంతరీకరణము అందును, స్వతంత్ర రచనలయందును పునరుజ్జీవనము కనిపించు చున్నది. ఒరియావాఙ్మయము జీవిత చరిత్రలయందును, విమర్శనాత్మక రచనలయందును కూడ గొప్ప అభివృద్ధి సోడియున్నది. Aª. So. D. ఒలింపిక్ క్రీడలు : 444 సంగ్రహ ఆంధ్ర మానవుడు పరిపాటించు క్రీడలన్నింటిలోనికి ఒలింపిక్ క్రీడల కున్నంత వైభవసంపన్నత, చరిత్ర ప్రసిద్ధిగల నేపథ్యము మరెద్దానికిని లేదు. ఈ క్రీడలు క్రీస్తుళకమునకు పెక్కు సంవత్సరముల పూర్వమే గ్రీకు వారిచే ప్రారంభింప బడినవి. క్రీ. శ. 892 లో ఇవి ఒకానొక రోమక చక్రవర్తి చే ఆపివేయబడినవి. ప్రాచీన తతంగ సంబంధమైన పెక్కు లక్షణములతో ఈ తరములో గూడ సాగునట్లుగా 1896లో ఇవి ఉద్ధరింపబడెను. కాలగర్భమున మునిగిపోయిన ప్రాచీనయుగ గ్రీకు చరిత్రను, ప్రపంచములో అత్యంత బలపరాక్రమాన్విత మయిన సామ్రాజ్యమని పేరొందిన రోమక చరిత్రను చాల వరకు ప్రకాశమానము గావించినదీ క్రీడలే. ఈక్రీడలు ఎట్లు ప్రారంభమయినవో అను విషయమున కొంత గజి బిజి కలదు. కాని క్రీ పూ 776 నుండి ఈ క్రీడలకథ సము చితముగ పరిరక్షింపబడినది. గ్రీకుభాషలో 'ఒలింపీడ్' అనుపదము కాలమానమును తెలుపునట్టిదిగా నున్నది. అనగా 'నాలుగు సంవత్సరముల 'కాల'మని అర్థము. ఒలింపిక్ క్రీడలు ప్రతి "ఒలింపిడ్" అంత్యభాగమున జరుగుచుండెను. మరి యొక విధమున చెప్ప వలసియున్నచో ఇవి క్రొత్త "ఒలింపీడు” ప్రారంభమును సూచించును. ఇంతవరకు ఇది నిర్దిష్టమయిన విషయమే. కాని ఒలింపిక్ క్రీడలు ప్రప్రథమమున ఎప్పుడు అనుష్ఠానము లోకి వచ్చెనో, ఏ యుద్దేశముతో వాటిని స్థాపించిరో ఇప్పటివరకును తెలియరాలేదు. అతి ప్రాచీనయుగములో ఈ ఉత్సవ కార్యక్రమము క్రీ. పూ. 1458లో ప్రారంభమయినట్లు విశ్వసింప బడు చున్నది. ఇవి కేవలము మల్లయుద్ధ ప్రదర్శనములు కేర్పడి నవికావు. ఒలింపిడ్ కాలములో మరణించినవారి గౌర వార్థము జరిపెడు స్మృతికలాపము మాత్రమే ఇవి. గ్రీకులు కాలమానమును కాలమానమును ఇప్పటివలె సంవత్సరము సంవత్సరముగా గణించక, నాలుగు సంవత్సరముల కాల మునుబట్టి గణించుటయే దీనికి మూల హేతువు. మానవులు మరణించినప్పుడు వారి ఆత్మలు ఆశరీర ములు జీవించియుండిన పరిసరములందే యుండునని గ్రీకుల పరమవిశ్వాసము, ప్రాణముతో మన్నప్పుడు తమకు