Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్షశిల్పము

సంగ్రహ ఆంధ్ర

శ్రద్ధారహితులను పృథక్కరించి, నమస్కారపూర్వకముగ హవిస్సులను సమర్పించెడి శ్రద్ధావంతులగు యజమానుల హవిస్సులనే భుజింపుడు—— అని.

దీనిలో దృష్టాంతముగా నీయబడిన ( పండిన భాగమును పండని భాగమును పృథక్కరించి) పండిన భాగమునే కోయుట ఆర్ష వ్యవసాయానుసారము కొడవళ్ళతో కోయునప్పుడే సంభవించును గాన కొడవళ్ళచే కోయు కోతనే ఈ శ్రుతి బోధించినట్లు స్పష్టమగుచున్నది.

ఉ. గ. శా.

ఆర్షశిల్పము  : భారతదేశమందలి ప్రజలకు వేదము ప్రమాణము. మానవుడు ధర్మార్థ కామమోక్షము లనేది నాలుగు పురుషార్థములను సాధింపవలయును. ఈ పురుషార్థములను సాధించుటకు భగవదుపాసనమే సాధనము. ఈ యుపాసనము అవ్యక్తోపాసనము, వ్యక్తోపాసనము, వ్యక్తావ్యక్తో పాసనము అని మూడు విధములుగ చెప్పబడినది, ఈ యర్ధమునే 'మానసీ హోమ పూజాచ బేరపూజేతి సాత్రిధా'అని ఆగమములు ఉపాసనాత్రయ స్వరూపమును వివరించినవి. అవ్యక్తోపాసనము చేయుట కష్టసాధ్యము. దీనిని సాధించుటకు అష్టాంగయోగసిద్ధిని పొందిన వారలే అర్హులు. ఈ యుపాసనమునే హృద్యాగము, మానసా రాధనము, అమూ ర్తపూజ యని కూడ చెప్పుదురు. కరచర ణాదులతో నిర్మింపబడిన భగవద్విగ్రహమును అర్ఘ్యము, పాద్యము మున్నగు నుపచారములతో పూజించుట వ్యక్తోపాసనము. వేదప్రామాణ్యము నంగీకరింపని వారు కూడ కేవల యుక్తి వాదముచే విగ్రహారాధనము చితైకాగ్రతను సాధించుటకు అవలంబము కాగలదని విశ్వసించి విగ్రహారాధనమును ఆదరించుచున్నారు. మంత్రపూర్వకముగ అగ్నియందు చేయబడెడి హవిస్యమర్పణము వ్యక్తా వ్యక్తోపాసనము. అది అగమశాస్త్ర సిద్ధాంతము.

'శిల్పం కర్మకలాదికమ్' అను కోశమునుబట్టియు, "తత్కర్మ యన్న, బంధాయ సావిద్యా యా విముక్తయే ఆయా సాయా పరం కర్మ విద్యాన్యా శిల్పనై పుణమ్." అను శ్రీ విష్ణుపురాణమునుబట్టియు, శిల్పశబ్దము వృత్తి విద్యలుగా చెప్పబడిన అరువదినాలుగు కళలకు సాధారణముగ వాచకమైనను, ఈ శబ్దము ఆలయనిర్మాణమును, విగ్రహ నిర్మాణమును చెప్పెడి శాస్త్రమందు రూఢమై వ్యవహరింపబడుచున్నది.

మానవునకు సహజమగు సౌందర్యపిపాస శిల్పకర్మకు నివాస మయ్యె ననియు సౌందర్యోపాసనము నిత్య సత్యముతో మిళితమై విగ్రహముల ద్వారమున పరబ్రహ్మో పాసనమునకు త్రోవ చూపినదనియు చారిత్రక విమర్శకులు విశ్వసించు చున్నారు. ఇదియు కొంతవరకు సత్యము కావచ్చును. పూర్వకాలపు శిల్పము శాస్త్ర నియమములకు కట్టుపడక తన్ని ర్మాతల యొక్క సహజ కౌశలమునకు తగినట్లు ఉత్తమోత్తమముగ సృజింపబడెననియు, కాలక్రమమున అట్టి సహజ శక్తి సంపన్నులు క్షీణింపగా ఆనాటి శిల్పమును ముందుంచుకొని, తరువాతివారలు లక్షణములను కల్పించి వాటిని శిల్ప శాస్త్రములందు పొందుపరచి రనియు, శాస్త్ర నియమములకు బద్ధుడగు ఆధునిక శిల్పి తన సహజశక్తిని వినియోగించుటకు శక్తి లేనివాడై చక్కని శిల్పమును సృష్టించలేకపోవుచున్నాడనియు విమర్శకులు అభిప్రాయపడుట కలదు. ఇందలి తత్త్వము నింకను పరామర్శింపదగును.

భారత భూమియందు లోకతంత్రముల నిర్వాహమందు అన్ని సమస్యలతో పాటుగ శిల్ప కల్పనము కూడ మతముతొ సర్వాంగీణమగు సంబంధమును కలిగి సజీవముగ నిలచి యున్నది. వేదకాలము నుండియు శిల, దారువు, లోహము, మృత్తు మొదలగు ద్రవ్యములచే పని చేయునట్టి స్థపతి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి మొదలగు జాతులవారు ఆ యా సమయములందు సంఘముచే గౌరవమర్యాదలతొ ఆదరింపబడుటయేగాక సంఘముపై ఆధారపడి జీవించుటయు కలదు. ఇట్టి వృత్తి విద్యలను సర్వారంభముగ లోకమందు ప్రవర్తింపజేసిన మహాపురుషుడు విశ్వకర్మ. ఈతడు అష్టవసువులలో కనిష్ఠుడగు ప్రభాసవసుపునకు బృహస్పతి సోదరియందు జన్మించినట్లు మహాభారతమందు కలదు. మానసారగ్రంథము ననుసరించి బ్రహ్మకు విశ్వరూపుడను కుమారుడు కలడనియు, విశ్వరూపుని సంతతిలో ఆరవ పురుషుడగు చాక్షుషమునికి పురుపు, పురుషుడు, సుద్యుమ్నుడు, విశ్వుడు, సాధ్యుడు అను ఏవురు పుత్రులు కలిగిరనియు, వీరలు వాస్తుశాస్త్రమును ప్రవర్తింపచేసి