Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎల్లోరా గుహాలయములు నంది ఆలయమునకు ఇరుప్రక్కల 51 అడుగుల ఎత్తు గల రెండు ధ్వజస్తంభములు గమనింపదగిన మరి యొక కళావిశేషము. దక్షిణ భారతములో ధ్వజ స్తంభముల నిర్మాణపరిణామదశయందు, ఈ రెండు ధ్వజ స్తంభముల నిర్మాణచాతుర్యము ముఖ్యమయిన ఒక ఘట్టమును సూచించుచున్నది. ఈ దేవాలయము యొక్క శిల్పా లంకారమునుబట్టి, ఇందలి అన్ని భాగములును శాస్త్రీయ ముగ నే నిర్మింపబడినవి. ఇందులో ప్రదర్శించిన నై పుణ్యము చిరస్మరణీయ మగు విశిష్టకళాఖండమునకు తగినట్లుగా నుండెననీ చెప్పగలము. రావణుడు కైలాసపర్వతమును పెకలించినట్లు రచించిన శిల్పము ఇందలి శిల్పవి శేషములలో అగ్రగణ్యమైనది. ఇందలి బ్రాహ్మణ గుహాలయములవలెనే, కై లాస సహాలయమందు ప్రదర్శింపబడిన శిల్పనై పుణ్యమునందు అత్యద్భుతమయిన శక్తి, అపరిమితమయిన తేజస్సు ప్రస్ఫు టముగ గోచరించుచున్నవి. దేవతలు మానవాతీతులని తెలియచేయుటకు పెక్కు తలలు, చేతులు, ఇతర ప్రధాన లక్షణములు ఈ విగ్రహనిర్మాణమందు కల్పించుట ఇందలి విశేషము. బ్రాహ్మణాలయములలో అచ్చటనచ్చట చురు కయిన చలనమును, సౌందర్యమును, సంతోషమును, లావణ్యములను చిలుకుచు, అయిదవ శతాబ్దినాటి బుద్ధ నిగ్రహసముదాయమును జ్ఞప్తికి తెచ్చు కొన్ని శిల్పవి శేష ములు కన్పించును. ఉదాహరణమునకు, ఆకాశ వీధియందు కొన్ని జంటలు ఎగిరిపోవుచున్నట్లు కైలాస గుహాలయపు గోడల పైభాగము మీద మలచిన చెక్కడములు వాటి సౌకు మార్యము, ప్రశాంతచిత్తము, గమనవిధానము, బౌద్ధా ప్సరసల మనోహరత్వమును, లావణ్యమును పోలియున్నవి. ఎల్లోరాలోని అన్ని గుహాలయందువలె, ఈ గుహాలయ మందు కూడ వర్ణచిత్రములు బాహుళ్యముగ తప్పక ఉండియుండవచ్చును. ఈనాటికి ఎత్తయిన గోడలమీదను, పైకప్పులమీదను వర్ణచిత్రముల ఛాయలు కన్పించుటయే ఇందుకు నిదర్శనము. ఇప్పటికిని కైలాస, గణేశ గుహా లయములందు వర్ణచిత్రముల చాయలు మిగిలియున్నవి. ఇచ్చటికన్న జైన గుహాలయములలో ఈ చాయ లెక్కు వగా కన్పట్టును. అజంతా గుహలకంటె ఎల్లో రాగుహలు ఎక్కువగా గురియగుటచే, ఎండ వానలకు ఇచ్చటి 380 సంగ్రహ ఆంధ్ర వర్ణములు వాతావరణ పరిస్థితుల ఒత్తిడికి తాళజాలక మకమకగా విలాసహీనములై యున్నవి. నమూనా పీష యములో అవన్నియు ఒకే వర్గమునకు చెందియున్నవి. అవి లతాపుష్పజాతులకు చెందిన తరగతులు; రేఖాగణిత (Geometrical) సంబంధ చిహ్నములు. వీటిలో ఆథరణ ముల పోకడలు, చారుచిత్ర సంబంధమయిన రీతులు చేరి ఉన్నవి. వీటిమూలములన్నియు అంతకుపూర్వము నిర్మింప బడిన అజంతా గుహాలయముల కప్పులపై ఇప్పుడు చూడ వచ్చును. కైలాస గుహాలయమునకు చెందిన ముఖమంటపము యొక్క పై కప్పు మీద చిత్రలేఖన చాయలు కొన్ని కన్పించుచున్నవి. ఇవి 8 వ శతాబ్ది మధ్యభాగముననో లేక కొంచె మవతలనో, ప్రధానాలయము మీద విగ్రహములు చెక్కబడిన కాలముననే చిత్రింపబడి యుండవచ్చును. వీటిలో ఒక చిత్రమందు పూజగొనుచున్న ఒక బ్రాహ్మణ దేవత చూపబడినది. ఇతడు శార్దూలముపై నధివసించి యుండును. ఆ శార్దూలము సింహపుతల, జూలు, పంజా తోడను, ఎద్దుయొక్క యో లేక మహిషముయొక్క యో కొమ్ములతోడను ఉండు పౌరాణిక ప్రసిద్ధిగల శరభమో, సాళ్వమో అయియుండును. భావనలోను, రూపకల్పన లోను ఈ బ్రాహ్మణదేవత శిరము అజంతాలో అదివరకు చిత్రింపబడిన బోధిసత్త్వుల శిరములను పోలియున్నది. అయితే ఈ వర్ణచిత్రములోని ఇతర వ్యక్తులు అతి వికృత రూపములో చిత్రింపబడి యున్నారు. అందుచే ఈ చిత్ర ముల యొక్క మతప్రాధాన్యము లోపించెను. ఈ చిత్ర ముల అవయవ విశేషములు వాటి పరస్పర అనను రూపతను చాటుచున్నవి. ఇంతియే కాక, అజంతా గుహల నుండి అరువు తెచ్చుకొన్న సంప్రదాయ సిద్ధములయిన మేఘరూపములు ఈ శిల్ప ప్రణాళికయందు మొత్తము మీద మోటుతనమునే ప్రవేశ పెట్టినవి. అందలి వర్ణములు గూడ లలితమయిన అభిరుచిని కల్పింపలేదు. కళాత్మక మయిన సౌందర్య, విశిష్టతలు ఈ చిత్రమందలి ప్రతి లక్షణ ములో నీరసింనచిట్లు ద్యోతకమగును. పై చెప్పబడిన ముఖమంటపము యొక్క కప్పుమీద వలయాకారముగ నొక మండలము గలదు. దీనిపై నొక పటముకూడ కన్నట్టును. అందు యముడు, అతని అర్ధాం