ఉపాధ్యాయుడు
సంగ్రహ ఆంధ్ర
లును (Knights) ఉండెడివారు. వివిధ వృత్తుల నవలంబించు కార్మికులు తమ వృత్తియందు విఖ్యాతి చెందిన యొక ప్రముఖునికడ శిష్యప్రాయులుగ పని నేర్చుకొని, వృత్తియందు ప్రావీణ్యమును సంపాదించుకొనిన వెనుక తాము స్వతంత్రులుగ పని చేయుటకు ప్రారంభించెడివారు. ఉన్నత కుటుంబములలో జన్మించినవారు తమ బాలురను ఏడు సంవత్సరముల వయస్సు వచ్చువరకుసు ఇంటికడనే ఉంచి, వారికి మరవిషయములు, నీతివర్తనము బోధించు చుండిరి. పిమ్మట బాలుడు ఉన్నత వంశ సంజాత యగు నొక నారీమణికడ భృత్యుడుగ సప్తవర్షములు పని చేయుచుండెను. ఈ కాలమునం దాతడు తన యజమానురాలికడ వ్రాతకోతలు, సంగీతము, నృత్యము, చదరంగము, సభ్యవర్తనము నేర్చుకొనుచు, తన యజమానురాలి ఆజ్జలను పాలించుచుండెను. ఈ కాలముననే బాలుడు ఇతరుల కడనుండి ముష్టియుద్ధము, ఈదుట మున్నగువాటిని కూడ నేర్చుకోనుచుండెను. బాలునికి పదునాల్గు సంవత్సరముల ఈడు వచ్చిన వెనుక ఆతడు ఒక భద్రపురుషుని (Lord) కడ వీరోచితములగు అస్త్రవిద్యల నన్నిటిని అభ్యసించు చుండెను.ఈ కాలమున ఈ విద్యార్థి తన యజమానురాలికి సమస్త శుశ్రూషలు చేయుచుండెడివాడు. ఇరువది యొక్క సంవత్సరముల వయస్సు వచ్చు సరి కాతడు విద్యలో పరిపూర్ణుడుగా భావింపబడుచుండెను. అప్పుడతడు స్వయముగ వీరపురుష దశ (Knighthood) ను పొందుచుండెను. ఈ విద్యాపద్ధతిని సభ్యతా విద్య (Chivalric Education) అని పేర్కొనెడివారు. పదమూడవ శతాబ్దినుండి ఐరోపాఖండములో విశ్వవిద్యాలయములు వెలసెను. అందు గొప్ప పండితు లాచార్యులుగ నుండెడివారు. విద్యార్థులు దూర ప్రదేశములనుండి ఈ విశ్వవిద్యాలయములకు ఏతెంచుచుండిరి. వీరొక ప్రసిద్ధుడగు గురువుకడ కొన్ని సంవత్సరములు శిష్యులుగ నుండి తుదకు పండిత బిరుదములను పొంది వెడలి పోయెడివారు. ఈ యుగమందు ఉపాధ్యాయ గౌరవము పలువురకు చెందుచుండెను.
మహమ్మదీయ మతము నవలంబించిన అన్ని దేశము లందును. విద్యకును, ఆ విద్యా కారణముగ గురువునకును సంఘమునందు. మిక్కిలి గౌరవము లభించుచుండెను. ప్రవక్త యగు మహమ్మదు విద్యను గూర్చి ఈ క్రింది అభి ప్రాయములను వ్యక్తపరచెను. "జ్ఞానమును సంపాదింపుము. భగవదాదేశము ప్రకారము జ్ఞానసముపార్జనము కావించువాడు, ఒక పవిత్ర ధర్మమును నిర్వర్తించు చున్నాడు. విద్యను గూర్చి ప్రసంగించువాడు పరమేశ్వరుని స్తోత్రము కావించిన వాడు. విద్యార్జనము కొరకై యత్నించువాడు భగవంతుని గౌరవించినవాడు. ఇతరుల యందు జ్ఞానోదయము కలుగజేసినవాడు గొప్పదాత. అర్హులగువారికి విద్యాదానము కావించినవాడు నిజమగు భగవత్సేవ కావించినవాడు. జ్ఞానవంతు డగువాడు కృత్యములను, అకృత్యములను గ్రహించును. జ్ఞానము స్వర్గమునకు త్రోవచూపును. ఎడారి ప్రదేశములో మన కయ్యది మిత్రము. నిర్జన ప్రదేశమునందు విద్యయే మన నేస్తకాడు, విద్య మనకు సౌఖ్యము కూర్చును. దుఃఖసమయమున అయ్యది మనకు ధైర్యము గొల్పును, విద్య మనకు వెలలేని భూషణము. విద్య మనసు శత్రువులనుండి కాపాడు కవచము. విద్యావంతుడగు మానవుడు ఉత్తమ గుణములను, ప్రాపంచిక గౌరవమును పొందును. ఆతనికి రాజాధరము లభించును. అతడు పరలోకమున నుత్తమ సౌఖ్యములను బొందును.” “కావున మహమ్మదీయ ప్రపంచమున విద్యకు మహత్తర గౌరవము లభించెను. మహమ్మదీయులు కూడ ప్రాచీన భారతీయులవలెనే గురువును మిక్కిలి గౌరవించుచుండిరి. పారసీకమందు గురువునొక ఋషిగ భావించుచుండిరి. సకల సద్గుణ సంపన్నుడగు నాతడు మాత్రమే గురుస్థానము నలంకరించుచుండెను. గురువు శిష్యుని పుత్ర వాత్సల్యముతో నభిమానించి అతనికి విద్య నేర్పుచుండెను. విద్యాప్రదానములో ధనాపేక్ష కెట్టి స్థానము లేకుండెను. గురువులకు లభించు వేతనము మిక్కిలి స్వల్పము. శుశ్రూషయే గురువునకు శిష్యుడొసగు వేతనము. ప్రభుత్వమువారిచే స్థాపింపబడిన, "మక్తబ్ మదర్సాలు" అనబడు విద్యాకేంద్రములలో పండితులగు వారిని నిర్ణీత వేతనములపై నియమించుట ఆచారముగ నుండెను. మహమ్మదీయ ప్రపంచమున లభితకళలను, వృత్తి విద్యను నేర్పుటకు వేర్వేరు గురువు లుండెడివారు. వారికి ఉస్తాదులు అని పేరు. సంగీతము, చిత్రలేఖనము మున్నగు, వాటిని శిష్యుడు గురువు పాదములకడ కూర్చుండి