Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - ౨

ఉపవేదములు


యైనను, మనకిప్పటికి తెలిసినంతలో నా విజ్ఞాన మావిష్కరించిన మహర్షులలో భరద్వాజుడును, దివోదాసుడును ఆద్యులుగా కనవచ్చుచున్నారు.

భరద్వాజుని శిష్యు డాత్రేయ పునర్వసువు. అతని శిష్యు లగ్ని వేళ హారీ తాదులు. ఆ యగ్ని వేశుడు నిర్మించిన యాయు ర్వేదతంత్రమునే తరువాత చరకముని యించుక సంస్కరించి తన పేర సంహితగా ప్రకటించెను. ధన్వంతరి యను బిరుదనామము పొందిన కాశిరాజ దివోదాసుడు ఉపదేశించిన వివిధ చికిత్సాతంత్రమునే సుశ్రుతుడు తన పేర నోకసంహిత గావించెను. భరద్వాజుని మరియొక శిష్యుడు హారితుడు తన పేరనొక సంహిత నిర్మించెను. ఇట్లు భరద్వాజుడు ఉపదేష్టగా చరక సంహితా, హారిత సంహితలు ఉదయించినట్లుండగా, ఆయుర్వేదమునకు ధన్వంత రియే మూలకర్తయని సుశ్రుతుడనెను. ధన్వంతరి కృత లక్షణ గ్రంథములో నారవ ప్రకరణమైన యగరతంత్రమునే యాత్రేయపునర్వసు నభ్యసించి, అగ్ని వేశుని కుపదేశించెను. అదే చరకముని నోటబడి చరక సంహితయయ్యెనని భావ ప్రకాశమనెడి అర్వాచీన వైద్యగ్రంథము భారద్వాజు నుపదేశకత్వమునే తొలగించెను. కాని ఐతరేయ బ్రాహ్మణాదులలోని ప్రసంగములనుబట్టి భరద్వాజు డాయుర్వేద ప్రవర్తకుడగుట నిర్వివాదమే.

అర్యులు, యాగియపశువులను ఛేదించునపుడు సకలావయవ సన్ని వేశములను, వివిధనాడులను, హృదయాది కోశములను పరిశీలించి, పరిశోధించి శారీర విజ్ఞానము నార్జించి యున్నారు. వివిధవస్తువుల గుణములను సక లౌషధుల శక్తులను కనుగొనియున్నారు. ఈ ద్వివిధమైన వారి విజ్ఞానమే వారి యౌషధ చికిత్సాసంప్రదాయమునకును శస్త్రచికిత్సా సంప్రదాయమునకును మూలకారణము. రోగముల స్వరూప స్వభావములను, వానికారణములను, తచ్ఛాన్తి సాధనములను తెలియచేయుచు ప్రాణులయాయువును వృద్ధి నొందింప నాధారమగుటచే నిది “ఆయుర్వేద" మైనది.

పూర్వోకములైన సంహితలుగాక తరువాత సుమారు వంద యేబది ప్రసిద్ధ వైద్యగ్రంథములవతరించినవి. వానిలో అష్టాంగహృదయము, శార్జ్జధరసంహిత, మాధవనిదానము, వైద్యచింతామణి మొదలయినవి చిరకాలముగ వైద్యులకు పఠనీయములుగా నున్నవి.

ధనుర్వేదము : తొల్లియార్యుల కంగరక్షయై, ప్రజానాయకుల కెల్ల యెడల విజయము చేకూర్చుచువచ్చిన యీ విద్య పూర్వమెంత పేరు మోసినదో, యిపుడంతగా దీని పేరు మాసినది. బుగాది సంహిత లందును బ్రాహ్మణారణ్య కాదులందును వర్ణింపబడిన అష్టి వజ్ర శతఘ్ని మొదలగు యుద్ధ సాధనముల వేళ్ళుమాత్రమే మన కిపుడు గోచరించు చున్నవి గాని తన్నిర్మాణ విధాన మేనాడొ మరుగుపడినది. శత్రుసంహారార్థము జపించుమంత్రములు కొన్ని యధర్వ సంహికలో నున్న నేమి ? తదాచరణము చిరకాలము క్రిందటనే యడుగంటినది. ప్రాచీన మహర్షులు కొన్ని వేల సంవత్సరములు తపస్సుచేసి తపోమయములైన రమ తేజస్సులనే యస్త్రములనుగా సందర్శించినట్లు వర్ణనలు మాత్రమే మిగిలినవిగాని, వారు కనుగొన్న జృంభక సమ్మోహ నాగ్నేయాది దివ్యాస్త్రముల విజ్ఞాన మిసు మంతయు మిగులలేదు. మహాభారత సంగ్రామము వరకు భరతఖండమున వెల్లివిరిసిన ఆ దివ్యాస్త్ర శస్త్రవిజ్ఞానమును బోధించు గ్రంథమేదేని సంస్కృతమున నుదయించి యుండకపోదు గాని, యిపుడదియును గనరాదు. ఆనాటి సమంత్రకములైన పరమాస్త్రములు నేటి యణ్వస్త్రములను గూడ మించినవి. తెలుగున "ధనుర్విద్యావిలాసము" నిర్మించిన గుంటూరు మండలవాసియు, మాధ్వుడునగు కృష్ణాచార్యుడు గ్రంథావతారికలో "సద్గురు లాభంబున నిద్రనుశ్శాస్త్రము మాకు నధీతంబయ్యె. తత్త ల్లక్షణంబులు శాస్త్ర సమ్మతంబులుగా నుపన్యసించేదను" అని వ్రాసినమాటలను బట్టి యాకవి సంస్కృతము లోని ధనుశ్శాస్త్రగ్రంథము చూచినట్లు గోచరించుచున్నది. అతడు క్రీ.శ. 1847 నాటివాడు. అతని గ్రంథము కూడ ముద్రితమయినట్లు కనరాదు.

గాంధర్వ వేదము : శ్రీహరి సొమగాన లోలుడు. ఆ సామగానమే భారత వర్షియ గానవిద్యకు నిదానము. దానిని ప్రవర్తింపజేసిన ప్రాచీనముని పరంపరలో నిప్పటికి తెలియవచ్చిన సొమగానాచార్యులు పదుముగ్గురు. వారిలో రాణాయమనతడు ప్రథముడు, కడపటియతడు జైమిని మహర్షి. అతని పుత్రుడు సుమంతుడు, అతని శిష్యుడు సుకర్ముడు. వారిరువురి వంశములవారును సామగాన ప్రవచనమున క్రమముగా వన్నెకెక్కినవారు.