పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు క్రీ. శ. (1509-1530) ఉదయగిరిని, కొండ వీటిని జయించి(1515) కృష్ణకు నుత్తరమున నున్న కొండపల్లిపై దృష్టిని సారించెను. మూడు మాసములు రాయలు ఇబ్రహీం పట్ట ణము నొద్ద సేనతో విడిసి కొండపల్లి దుర్గ ముట్టడించి, మును దానికి సేనాధ్యకు డై న రామదేవుని బంధించి విజయ యెట్ట కేలకు మును సాధించెను. చిత్రం - 6

కొండపల్లి బొమ్మలు - 1 రాయల సేనానులు కొండపల్లి దుర్గము నీ క్రింది విధ ముగ ముట్టడించిరి. ఎఱ్ఱఋరుజును ఆ దెప్పనాయకుడును, ఎడ్లకొండను తిమ్మప్ప నాయకుడును, హనుమంతు


చిత్రం 7

కొండపల్లి బొమ్మలు - 2 ఋరుజును కొండమరెడ్డియు, ఒంటి మన్యపు బురుజును కామానాయకుడును తమతమ సేనలతో చుట్టుముట్టిరి. ఇట్లు నాలుగు విభాగములైన రాయల సేనలు నలుమూల లనుండి దుర్గమును విధ్వంసము చేసినవి. గజపతివీరుల మొండెములతో, సై నిక క ళేబరములతో నెమ్మల రాసులతో, పాడరిన మహలులతో,

. సహస్రాధిక గజాశ్వ ఖండములతో నిండి ప్రేతభూమివలె నగ పడు కొండప ల్లికోటను శ్రీకృష్ణ దేవరాయలు క్రీ.శ. 1518 వ సంవత్స రము జనవరి నెలలో స్వాధీన మొనర్చు కొ నెను. కొండపల్లి లో బంధింపబడిన కటకే శ్వరపాత్రుని భార్యను, పుత్రుని, గజపతి ముఖ్య 49