పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3 కొండపల్లి


ప్రతి ప్రాకారమునకును బురుజులు నిర్మింపబడినవి. ఈ బురుజులకడ సేనాధిపతులు కావలి కాయుచుండెడి వారు. ఈ ప్రాకారములు దుర్గము చుట్టును మహోన్నత మగు పర్వతముల నొరసికొని యున్నవి. నడుమ నడుమ కొండవరుసలే పెట్టని ప్రాకారములై దుర్గమునకు శ్రీరామరక్షలైనవి, ఈ సహజ ప్రాకారములు విచిత్ర శోభావహములు. ప్రాకార పరివేష్టితమైన యేడు బురుజులను దాటి పైకి పోయినచో నొక సింహద్వారము గానుపించును. ఆ ద్వారమును దాటి లోనికి పోయినచో మహోన్నత మైన యింకొక ప్రాకారము తగులును. ఈ ప్రాకారము దుర్గప్రదేశమును ఆవరించియుండును. ఇది వల్గదరివర్గ హయురఘట్టనలభేద్యము; శాత్రవ భయంకరము; మహృద్దర్శనీయము. ఈ ప్రాకార పంక్తుల మధ్యనున్న నిర్మాణములును, పౌధములును ప్రాచీన సభ్యతా శిల్ప సౌందర్యమునకు పరమావధులు. ఈ కట్టడములలో ధనాగారము లన్నియు నొకచోట నున్నవి. వాని కావల సేనాధిపతుల సౌధ ములు కలవు. వీనిసమీపమున నే రాజమహలులు, రాజాంగ వాంతఃపురములును, ఉద్యానవనములును ఉన్నవి. రాజవీధులు సామీప్యమున అరువది ధనుస్సుల దూర ములో దర్బారు భవన మొకటి కలదు. తద్భవనోపరి నిర్మిత శిలా విగ్రహములును, శిలాలతలును ప్రాచీన శిల్ప ప్రావీణ్యమున కతిభూములు. ఈ భవనమునకు అధో భాగమునగల గజాశ్వశాలలు అతి భయంకరములై కప్పడును. దుర్గ సంరక్షణార్థము చుట్టును పర్వత శ్రేణులపై నాలుగు రక్షణస్థలు లేర్పరుప బడినవి. కొండపల్లి దుర్గమునకు తూర్పు భాగమున హను ముంతు కొండ గలదు. రాజ భవనమునకును దీనికిని రమా డమి వేయి ధనుస్సుల దూరము. హనుమంతు కొండ బురుజుపై నొక చిన్న ద్వారమున్నది. అందు సైన్యా ధ్యక్షుడు నివసించుటకు సౌకర్యము లమర్పబడినవి. బురుజు నందే యైదువందల మంది సైనికులు ఖడ్గ కవచధారులై కాపుండెడివారు. ఈ కొండపై నుండి చూచినచో హైదరాబాదు పోవు దండుబాటయు, కృష్ణా మునగపడగలవు.

కొండపల్లి దుర్గమునకు దక్షిణ పార్శ్వమున ఎఱ్ఱ బురుజు గలదు. ప్రధాన దుర్గమునకును దీనికిని రమారమి రెండుమైళ్ళు దూరముండును. తూరుపు కనుమల వరుస నంటి సుమా రేబదిమైళ్ళు దూరములో గల ప్రదేశము లను గూడ చూచుటకు అనువుగా నీ బురుజు మిక్కిలి యెత్తైన స్థలమునందు కట్టబడినది. దీని నుండి అమరావతీ ప్రభృతి పుణ్యక్షేత్రములను సందర్శింప వచ్చును. ఈ బురుజు పై వేయి సంఖ్య గల సైనిక పటాల ముండెడిది. కొండపల్లి దుర్గమునకు పడమటి భాగమున ఎడ్లకొండ బురుజు గలదు. ఇదియు పైన ఉదాహృతములైన రెండు బురుజుల కంటె నున్నతమై యున్నది. అనల్ప శిల్ప విన్యా సము గల కోట ప్రాకారములచే నిది పరీవృతము. సైన్య ములను బురికొల్పుటకై నగారా మ్రోయించు సై నికుల కిది విడిదిపట్టుగా కట్టబడెను. ఇందు వేయి పటాలము లుండుచుండెను. దీని నుండి చూచినచో నందిగామ సీమ యంతయు గనబడగలదు. రాజులు కొండపల్లి కోట నిర్మాణ రహస్యమంతయు ఒంటి మన్యము బురుజు కట్టడమునందే గుప్తమైయున్నది. ఈ బురుజు నేలమట్టమునుండి యేడువందలగజముల యెత్తున నుండును దీని శిఖరాగ్రము నుండి పరీక్షించినచో కృష్ణా మండలమునకు ముఖ్యపట్టణమైన బందరు సముద్ర దృశ్యము దృగ్గోచరమగును. ఈ బురుజు మండియే రెడ్డి కొండవీటి దుర్గమును వీక్షించెడివారు. పైని బేర్కొన్న మూడు రక్షణ కేంద్రముల కంటే నిది కీలక స్థలము. ఇది యవలీలగ వేలకొలది శత్రువులను సంహ రించుటకువీలగునట్లు కట్టబడినది. దీనిని చేరుకొనుత్రోవలో మహా వృక్షములును, గండశిలలును, అల్లిబిల్లిగ నల్లుకొనిన తీవె జొంపములును అసంఖ్యాకములుగ నున్నవి. అటు పోవునపుడు కుంజపుంజము లెంత యానంద సంధాయక ములో పర్వత గుహల నుండి వెలువడు క్రూరమృగముల ధ్వనులును, ప్రతిధ్వనులును కీచురాలగానము అంత భీతా వహములు. ఒంటి మన్యముపై నొక ద్వారమున్నది. ఆ ద్వారము నొద్ద నొక సైనికుడు కావలి కాయుచుండెడి వాడు. శత్రు సైన్యములు పండ్రెం డామడల దూరమున నున్నపు డేకని పెట్టి రణ భేరి మ్రోయించుట తద్వార ని వేళిత 47