పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేరళదేశము (చరిత్ర) సంగ్రహ ఆంధ్ర


భర్తను విడనాడవలసినపు డా వస్త్రమును తిరిగి యందించి విడిపోవుట ఆచారముగా నుండినదట! ఇపుడది యరుదు. కాని వివాహమున జరుగు తంతుమాత్ర మంతియే. ఈ మధ్యకాలమున పూలహారములు వేయుట, మాంగల్య ధారణము చేయుట నూతనముగా కలవారి కలవాటయి నది. దీనివలన వివాహపద్ధతి వైదిక సంస్కారము కాద నియు, కేవల గాంధర్వ వివాహపద్దతి యనియు, రిజిష్టర్డు వివాహముకంటే సులభమైన దనియు స్పష్ట మగు చున్నది. వర్ణాశ్రమధర్మముల కనుబంధముగా నేర్పడిన కులవి భే దముల కరకుదనము కేరళ కొక ప్రత్యేకత నా పాదించు చున్నది. భారతదేశమం దంతటను కులతత్త్వ పద్ధతులు వ్యాప్తమై యుండినను, అవర్లు అంటరానివా రగుటయే గాక, వారికి సవర్ణు లుపయోగించు రహదారులపై నిరా టంకముగా నడచుట కవకాశము లేదు. అట్లు నడచుట అవసరమైనచో వారు సవర్ణులకు దూరముగా నడచు చుండి “ మే మవర్ణులము సమీపించుచున్నాము. తొలగి పొండు" అని సూచించు నినాదములనో, లేక సైగలనో చేయవలసి వచ్చుచుండెనట! అస్పృశ్యత (untouchbi- lity) యేగాక అసామీప్యత (un-approachability) యును అమలులో నుండెడిదట ! ఆ కారణము చేతనే కేరళము భారతదేశము నందలి ఒక "ఉన్మత్తాలయము" (mad-house) అని స్వామి వివేకానందునిచే విమర్శింప బడినది. తిరువాన్కూరు రాష్ట్రములో ఈ కట్టుదిట్టము లన్నియు శాసనము ద్వారమున 25 సంవత్సరముల క్రింద రద్దుచేయబడినవి. దేవాలయ ప్రవేశాధికారముతో పాటు అన్ని మానవహక్కులు పిదప విప్లవాత్మక మైన సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కరణలు జరిగినవి. సమానముగా నొసగబడినవి. మహారాజావారి అనుశాసనమున రణమును తిరువాన్కూరు కనువగు వాతావరణము కలిగించి అస్పృశ్యతా నివా ఆచరణలోనికి తెచ్చినది శ్రీ నారాయణ గురువుగారి సంఘ సంస్కారపరమైన ఆందోళన. గురువుగారు అస్పృశ్యజాతి యనబడు “ఇఝవా” కులము నకు చెందినవారు: ఒకే దైవము, ఒకే జాతి, ఒకే మతము అను నొక ముద్రావాక్యముతో గొప్ప మతసంచలనము

గావించి ఈ అవర్ణులగు వెనుకబడిన జాతుల వారియందే గాక, సవర్ణులందును మహత్తరమైన సంచలనమును గలి గించిరి. తత్పరిణామముగా ఈ కుల, మత వివక్షత లన్నియు రానురాను అంతరించినవి. క్రైస్తవులు : కేరళ రాష్ట్రములో క్రీ.శ. ఒకటవ శతాబ్దియందు సెయింట్ థామస్ అను మతగురువుచే క్రైస్తవమతము ప్రవేశ పెట్టబడినది. ఇతడు క్రీ.శ. 52 వ సంవత్సరమున కేరళమునకు వచ్చి పెక్కు నంబూద్రి కుటుంబములను, ఇతర హైందవ కులములను క్రైస్తవ మతములో కలిపివేసెను. కేరళ క్రైస్తవులు ఇప్పటికిని సెయింట్ థామసును అత్యంత గౌరవమర్యాదలతో చూచెదరు. ఇతడు కేరళములో ఏడు క్రైస్తవ దేవా లయములను స్థాపించెను. అనంతరం మితడు కోరమాం డల్ రేవు ప్రాంతమునకు పయనమయి అచ్చటగూడ తన మతవ్యాప్తి కార్యక్రమమును కొనసాగించెను. ఈ ఉదంత మిట్లుండ కేరళమునందు 4వ, 5వ శతాబ్దములలో మాత్రమే క్రైస్తవ మతము ప్రవేశ పెట్టబడెనను జన శ్రుతి గూడ గలదు. ఈనాటికిని సిరియన్ క్రైస్తవ వర్గములో పెక్కు బ్రాహ్మణ సంప్రదాయములు, ఆచార వ్యవహారములు ఆచరణ మందున్నవి. పాలమూరు అను గ్రామములో అనేక సిరియన్ క్రైస్తవ కుటుంబముల ఆవరణముల లోను, బావులయందును, పూర్వము బ్రాహ్మణులచే ఉప యోగింపబడిన కంచుభూషణములును, ఇత్తడి పాత్ర లును ఈనాటికిని లభింపగలవు. సెయింట్ థామస్ చే కేరళములో క్రైస్తవులుగా థామస్ క్రైస్తవులమని మార్చబడిన వారందరును చెప్పుకొనుచుందురు. వీరందరును కోడుంగల్లూరు, పాల యూరు, పారూరు, కోకమంగలమ్, క్విలన్, నిరానమ్, చాయల్, (నిలక్కల్) అను కేంద్రములకు చెందిన వా రే. కొడంగల్లూరునందు సెయింట్ థామస్ ప్రప్రథమముగా, 'చేరమన్ పెరుమాల్'ను, అతని కుటుంబమును, నలుబది యూదుకుటుంబములను, నాలుగు వందల హైందవకుటుం బములను, క్రైస్తవ మతమున ప్రవేశ పెట్టినట్లు తెలియు చున్నది. కేరళమున క్రైస్తవ మతమును వ్యాప్తిగావిం చిన పిదప సెయింట్ థామస్, తూర్పు సముద్ర ప్రాంత34