గోపమంత్రి - నాదిండ్ల
సంగ్రహ ఆంధ్ర
కార్య నిర్వహణమునందు గోపప్రభునకు 'యూరదేచ యామాత్యుడను నాతడు మంత్రిగానుండెను. ఈ యూర దేచమంత్రియు సంస్కృతమున గట్టిపండితుడు. మహా విద్వాంసుడగు లొల్లలక్ష్మీధరుని శిష్యుడు. ఆంధ్రభాష యందభిమానముగల మనీషి. ఈ దేచమంత్రికే కుమార భారతియను బిరుదునందిన తెనాలి రామలింగకవి శైవుడై యున్నప్పుడు ఉద్భటారాధ్య చరిత్రమను ప్రశస్త శైవ ప్రబంధమును రచించి కృతినిచ్చెను. ఉద్భటారాధ్య చరిత్రమునందు గోపమంత్రిని తెనాలి రామలింగకవి ఎంతో మనోహరముగా స్తుతించియున్నాడు.
గ్రంథరచన : సంస్కృతమున గోపనమంత్రి కృష్ణమిశ్ర విరచితమై ప్రఖ్యాతమైన ప్రబోధ చంద్రోదయము అను వేదాంతాంతరార్ధకథా సమన్వితమైన నాటకమునకు "చంద్రికా" అను సంస్కృత వ్యాఖ్య రచించినాడు. ఈ వ్యాఖ్యానము తోడనే సంస్కృతమున నీ నాటకము ముద్రితమైనది. ప్రబోధచంద్రోదయము ఉపనిషదర్థ ప్రతిపాదితమైన గంభీరార్థముగల నాటకము. ఇందు భౌద్ధ, జైన, చార్వాక మతఖండనాదులు కలవు. వేదాంత శాస్త్రమున నిరూఢ ప్రజ్ఞగలవారికి మాత్రమే ఈ నాటకము గ్రాహ్యమగుట కవకాశము గలదు. అట్టి శబ్దశ్లేష పారిభాషిక పదబంధురమైయున్న ఆ మహానాటకమునకు గోపన చక్కని వ్యాఖ్య రచించినాడనుటచే అతనికి సంస్కృత భాషయందు, శాస్త్రవిశేషములందు ఎట్టి దండిపాండిత్యముగలదో స్పష్టమగుచున్నది. వ్యాఖ్యా నారంభమున గోపమంత్రి వ్రాసిన శ్లోకము లాతని సంస్కృతకవితాశ క్తిని ప్రదర్శించునవిగా నున్నవి.
శ్లో. అస్తి ప్రశస్తమహిమా నరసింహసూనుః
శ్రీకృష్ణరాయనృపతి ర్నృపసార్వభౌమః
యస్యోద్ధతా సమరసీమ్ని కృపాణవల్లీ
దూతీ భవ త్యమరలోకవిలాసినీనామ్.
శ్లో. తస్య శ్రీకృష్ణరాయస్య ప్రాజ్యరాజ్యధురంధరః
కులక్రమాగతో మంత్రీ సాళ్వతిమ్మచమూపతిః.
శ్లో. ఆపూర్వపశ్చిమసముద్ర మదత్తరాజ్యమ్
ఆసేతుసింహగిరి చాత్ప్రతిమప్రతాపః
యః కృష్ణరాయనరపాలకదండనాథః
కౌండిన్యగోత్రతిలకః కవిపారిజాతః.
గద్య: ఇతి శ్రీమద్రాజాధిరాజపరమేశ్వర శ్రీమత్ప్రతాప శ్రీకృష్ణరాయమహాసామ్రాజ్య ధురంధరసాళ్వతిమ్మ దండనాయక భాగినేయ నాదిండ్లగోపమంత్రిశేఖర విరచితాయాం ప్రబోధచంద్రోదయ వ్యాఖ్యాయాం షష్టో౽ంకః సమాప్తః.
సంస్కృతగ్రంథములు వ్రాసిన తెలుగువారిలో గోపనకు ప్రముఖస్థానమున్నది.
నాదిండ్లవారి వంశచరిత్రము నెరుంగుటకు శాసములు గూడ మనకు తోడ్పడుచున్నవి.
1. క్రీ. శ. 1515 నాదిండ్ల అప్పమంత్రి మంగళగిరి శాసనము.
2. క్రీ. శ. 1520 నాదిండ్లగోపమంత్రి కొండవీటి శాసనము.
ఈ రెండు శాసనములును సంస్కృతభాషలో ప్రశస్తమైన కవితతో వెలయుచున్నవి. ఈ శాసనములను రచియించిన మహాకవి లొల్ల లక్ష్మీధరుడు. మహావిద్వాంసుడగు నీతడు గజపతుల యాస్థానమున నుండినవాడు. తరువాత కృష్ణదేవరాయలవారి ఆస్థానమున కలంకారభూతుడయినాడు. అప్పమంత్రి మంగళగిరిశాసనమున సాళ్వతిమ్మరుసుమంత్రి ప్రశస్తి - నాదిండ్ల సాళ్వవంశీయుల సంబంధములు తెలుపబడినవి. అప్పమంత్రి యొనర్చిన దావాదికములు, అగ్రహారములు, తటాకప్రతిష్ఠ, దేవాలయప్రతిష్ఠాపనము మున్నగునవి ఆయా కాల ప్రమాణములతో లిఖితములైనవి. ఇందు తిమ్మరుసున కల్లుడును, గోపనకు అగ్రసోదరుడును అగు నాదిండ్ల అప్పమంత్రి వినుకొండ గుత్తిసీమలకు పరిపాలకుడుగా నియమితుడైనట్లు చెప్ప బడినది.
గోపమంత్రి కొండవీటిశాసనము మంగళగిరి శాసన ప్రారంభ శ్లోకములతోడనే మొదలిడి వంశవృత్తాంతమును అట్లే వివరించుచున్నది. ఆ శ్లోకములుగూడ రెంటను సమానములే. గోపమంత్రి కొండవీటి యజ్ఞ వాటికా రఘు నాయకులకు దేవాలయశిఖరము - మండపగోపురములు - తిరుచుట్టుమాలియ కట్టించి ఆ దేవరకు లేంబల్లె, మైదవోలు అను రెండు గ్రామములు సమర్పించెనను విషయము ఈ శాసనమున నుట్టంకింపబడినది.
కృష్ణార్జున సంవాదము : గోపన తెలుగున ద్విపదకావ్య
466