పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుందుభియను వాద్యముపై జెట్టుకొమ్మ గాలికి గదలి గట్టిగా దగులుచుండుటవలన నది బిగ్గఱగా ధ్వని చేయుచుండెను. అపు డా నక్క దాని దగ్గరికిబోయి యది కొఱికి చూచి యందు బ్రవేశించి బయటికి వచ్చెను. అట్లు భేరీముఖమందలి చర్మము గొఱికివేయగానే యాధ్వని నిలిచిపోయెను.

అపు డాజంబుకము "ఎంతపొరపడితిని. ఇంత యాహారము విడిచిపెట్టి యీశబ్దమునకు జడిసి పాఱిపోవుటకు సిద్ధపడితిని" అని యనుకొనుచు సంతసముతో గావలసినంత యాహారము దిని తనదారింబోయెను. కావున నాధ్వనికి గారణ మరసి ప్రతిక్రియ చేయుదు" నని పలికెను. పింగళకుడు "సరే" యని సెలవిచ్చి పంపెను.

దమనకు డట్లు బయలుదేఱి పోవుచుండ వానివెంట నరిగి కరటకు డిటు లనియెను. "భయమునకు గారణ మెఱుంగకుండ, నది తొలగింప శక్యమైనదో కాదో తెలియకుండ భయప్రతీకారమునకు శపథముచేసి రాజసత్కారము నొందితిమి. ఉపకారము జేసియేకాని యెవ్వరివలన గానుకలు గ్రహింపరాదు. అందునను రాజువలన నెంతమాత్రము స్వీకరింపరాదు. ఏలయన రా జనుగ్రహించెనేని సంపదలు, విక్రమించినయెడల విజయము, గోపించినయెడల మృత్యువును గలిగింపగల సమర్థుడై యుండును. ఎట్టివాడైనను రాజు నవమానింపరాదు. రా జన నరరూపమున నుండు దైవమే కాని