6
సూక్ష్మాంగము:- పది హేడుతత్వములతో గూడియుండునది సూక్ష్మాంగ మనబడును.
కారణాంగము:- ఈస్థూలసూక్ష్మములు రెండింటికి హేతుర్భూతమై అజ్ఞానస్వరూపమై యుండునది కారణాంగ మనంబడును.
యీవిచారమునకు ఫలంబేమనిన, ఆత్మ సాన్నిధ్యమునవున్న సూక్ష్మశరీరము చేతనే స్థూలశరీరద్వారా కర్తృత్వభోక్తృత్వములు జరుగుచున్నవని తెలియుటేఫలము.
జాగ్రదావస్త, స్వప్నావస్త, సుషుప్త్యావస్త యీ 3 న్ను అవస్థాత్రయ మనంబడును.
జాగ్రదావస్తయనగా - మేలుకొనియుండుట.
స్వప్నావస్తయనగా - కలలుగనుట.
సుషుప్త్యావస్తయనగా - సుఖముగా నిద్రబోవుట.
ఇందుకు ఫలం బేమనిన, యీఅవస్తాత్రయమునకు ఆత్మ సాక్షియై యున్నాడని దృడముగా తెలియుట.
విశ్వుడు, తైజనుడు, ప్రాజ్నుడు యీ 3 న్ను జీవత్రయ మనబడును.
విశ్వుడు - జాగ్రదావస్తవాసుడు
తైజనుడు - స్వప్నావస్తవాసుడు
ప్రాజ్ఞుడు - సుషుప్త్యావస్తవాసుడు. గనుక, జీవత్రయమునకు ఆత్మసాక్షియై యున్నాడని తెలియుటయే ఫలము.
భ్రూమధ్యము, కంఠము, హృదయము యీ 3న్ను స్థానత్రయ మనబడును.
అంగత్రయము | స్థూలము | సూక్ష్మము | కారణము |
అవస్థాత్రయము | జాగ్రత | స్వప్నము | సుషుప్తి |
జీవత్రయము | విశ్వుడు | తైజనుడు | ప్రాజ్ఞుడు |
స్థానత్రయము | భ్రూమధ్యము | కంఠము | హృదయము |