పుట:Sakalaneetisammatamu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

ఈ గ్రంథప్రశస్తిని గూర్చి- పునర్ముద్రణావశ్యకతను గూర్చి నేను మూడుపరియాయములు హెచ్చరించితిని.[1] నేటి కిది ద్వితీయముగానేగాక , అద్వితీయముగా కూడ ముద్రణమైనందులకు ఎంతో సంతోషింపవలసియున్నది.

ఈ గ్రంథమింతవఱకు అజ్ఞాతవాసము చేయుచున్నందున ప్రథమముగా గ్రంథమునుగూర్చి, గ్రంథస్థవిషయములనుగూర్చి తెలిసికొనుట యావశ్యకము గాన వానితో ప్రారంభించుచున్నాను.

2. గ్రంథరచనావిధానము

శ్రీ కవిగారివ్రాతను బట్టి యిది సంకలనగ్రంథ మగుట స్పష్టము.

సింగన తాను రచియించినది సంకలనగ్రంథమే యైనను, దీనిని “ప్రబంధ'మనియే వ్యవహరించియున్నాడు. ప్రబంధమువలె నిందు, కృత్యవతరణిక , షష్ఠ్యంతములు , ఆశ్వాసాద్యంతపద్యములు, గద్య గలవు. “నారద వసిష్ట పరాశరబాదరాయణ భృంగ్వాంగిరసగురు శుక్రమతానుసారంబై దేవ మానవ రాక్షసంబులగు నయశాస్త్రంబులు పరీక్షించి యంధ్రభాషాకోవిదులగు సుకవీంద్రరచితంబైన ముద్రామాత్య- పంచతంత్రీ- బద్దె భూపాల- చాణక్య- ధౌమ్య- విదుర- ధృతరాష్ట్ర- బలభద్ర- కామందక- గజాంకుశ- నీతిసార- నీతిభూషణ- క్షేమేంద్ర- భోజరాజవిభూషణ- పురుషార్థసార- భారత- రామాయణాది మహాకావ్యంబులు, పురాణేతిహాసంబులు, కందనామాత్యునీతితారావళి, లోకోక్తి - చాటుప్రబంధంబులయందును గల నీతివిశేషంబు లూహించి తత్తత్సారాంశంబు లయ్యైవిధంబుల వర్గసంగతంబుగా సకలనీతిసమ్మతం బనుపేర నొక్క

ప్రబంధంబు

రచియింపుదునని ప్రబంధసారంబునకు ననుగుణంబుగా నేపురుషునిం బ్రార్థింతునో యని విత్కరించి" అని సింగన వ్రాయుటయే గాక గద్యయందు-

  1. పూర్వగ్రంథములు పునర్ముద్రణావశ్యకత భారతి సం. 28.నం. 6, 488-441. పుటలు ఆకరగ్రంథములు. భారతి - జూలై 1963, భారతి - జూలై 1967