పుట:Sakalaneetisammatamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. సరులు గుచ్చినయట్లు వెరసులు చక్కఁగా
విదిశ మయిన లెక్క వెసగవిడుచు
నెలమి నేకస్థానములు దశస్థానముల్
చెదరిపోవకయుండఁ జిరువపుచ్చి
తలఁపులో మఱవక తరవాయి దప్పక
కుఱుచలు ద్రొక్కక కుంటుపడక
యెదిరివారు వినఁగ నెన్నక బలపంబు
మోపక పెనువ్రేలు దాఁపుగొనక
గీ. తెలివిపడఁగూడి తలఁపులోపలను వెరసు
నిశ్చయము చేసి వ్రాయంగ నేర్చు నతని
గణితశాస్త్రజ్ఞు లిల మేటికరణ మండ్రు
మంత్రిమందార యబ్బయమంత్రి కంద. 297

సీ. పదియంకనంబును బడభుజ చేతప్పు
దెలిహంసపదముతోఁ గిలుము కత్తి
తుడుపు తద్ద్విగుణంబునెడల నిద్దఱివ్రాలు
నిరుఘంటలిఖితంబు విరసపత్రి
పత్రికతుడుపులోపలిసంజ్ఞ భుజలెక్క
తక్కువెక్కువగాక చక్కనిడుట
లలివర్గుజాడలోఁ గలిగి వెరసులలోఁ
దగులకుండుటయందు మిగులమంటఁ
గీ. గలుగులెక్కలుమాఱుగ వెలయు జాడ
వర్గవులు గూర్చి నెడలను వ్యయము డించి
నిలువ సేసినసందులు నెరయ నెఱుఁగు
కరణ మెంతయు నేర్పరి కందమంత్రి. 298

సీ. దొరలు ప్రజలు బంట్లు తొల్లిటిరీతిన
కడమజీతవహియు మడుసువడిన
మనవిఁ జెప్పఁగఁ జేరఁ చనుదెంచునప్పుడు
పరుసఁదనము లేక విరసపడక
మన్నన దప్పక మధురోక్తు లుడుఁగక
కవిలెలోపల వ్రాఁతకందు వెఱిఁగి
తరము దెలిసి వానిఁ దగిలెడుపని దీర్చి
వీఁకతోఁ దా నట్లు గాకయుండఁ
గీ. బొరసి గాదెయు ముడుపును బొరయఁబోక
యాయవంచన మొదలుగాఁ జేయ కుడిగి
యేలినాతనియందుల హితవు గలిగి
మనెడునాతఁడు కరణంబు మంత్రికంద. 299

మదీయము



క. ధరణీశుసొమ్ము ప్రజలన్
బొరయింపక ప్రజలసొమ్ము భూపతియందున్
జొరనీక రెంటనుం దాఁ
బొరయక యున్నట్టి కరణమునకున్ సరియే. 300

క. కరణంబుకొడుకు ముందఱ
కరణికధర్మంబునందుఁ గడుఁ గుశలుండై
ధరణిఁగల విద్య లన్నియుఁ
బరువిడి నెఱుఁగంగవలయుఁ బని లేకున్నన్. 301

మ. శకకాలంబును వత్సరంబు నెల పక్షంబున్ దిథిన్ వారము
న్నొకదేశంబును దాని నేలు విభు నయ్యూరుం నిజస్థానమున్