పుట:Sakalaneetisammatamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

సకలనీతిసమ్మతము

ద్వితీయాశ్వాసము

శ్రీమద్రామాచలనగ
రీమంటప హేమకుంభరిపుభయదగదా
తామరసశంఖచక్ర
క్షేమంకరకరచతుష్క కేశవనాథా. 290

వ. దేవా చిత్తంబున నవధరింపుము. 291

కరణీకపునీతులు

క. మంత్రికి నధికారమునకుఁ
దంత్రమునకు వలయుపనులు దప్పక కార్యా
మంత్రణము సేయఁ గరణము
మంత్రి యనంబరఁగు నతఁడు మనుజేశునకున్. 292

క. కరణము రాజగృహంబున
కరయంగా రత్నదీప మగు విజ్ఞాన
స్ఫురణమునఁ బరులతమములు
కర మరుదుగఁ బాప నొప్పు కరణం బగుటన్. 293

క. ఆయవ్యయముల చిక్కులు
పాయంగాఁ జేయఁ గవిలెపట్టున మాత్రన్
ధీయుక్తి నున్నురూపమ
చేయుచుఁ గరణంబు ప్రజలచేఁ బొగడందున్. 294

నీతిసారము



సీ. ఆయవ్యయంబులయాజాడ లూహించి
యాయాయివర్గవు లమర నిలిపి
పురుషవర్గువు లోలి పరికించి నెరుసులు
దప్పిపోవకయుండ నొప్పు దీర్చి
యవనీశువ్రాతాకుఠవిణలఁ గ్రితచొప్పు
కవిలెసంప్రతులను గలుగ నెఱిఁగి
వరుస నాయవ్యయవాచనంబులు వ్రాసి
వడినెత్తుటావర్గువులకుఁ బాటి
ఆ. గాఁగ నిర్ణయించి కలతరుగువుపొత్ర
తెలిసి ధాన్యరొక్కములకు విలువ
పేరుబడియుఁ దెలుపఁ బెద్దయు నేర్చుట
కరణికంబు ధాత్రిఁ గందమంత్రి. 295

గీ. వ్రాయఁడేని మఱచె వైళమై కవిలెలో
గీయడేనిఁ జెఱిచె గీసవలన
నిట్టి ధాన్యవివర మెల్లయు నెఱుఁగఁడేఁ
గరణ మనరు వానిఁ గందమంత్రి. 296