పుట:Sahityabashagate022780mbp.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి సంస్కృతి, తెలుగు భాషా సాహిత్యాల కళల అభివృద్ధి, వైజ్ఞానిక సాంకేతిక ప్రగతి మొదలయిన విషయాలపై చర్చాగోష్టులు జరుగుతవి, తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని వివిధ కోణాలనుంచి ప్రస్ఫుటంచేసే ఒక ప్రదర్శన ఏర్పాటు అవుతున్నది. తెలుగువారి సమగ్ర స్వరూపాన్ని సందర్శించడానికి వీలైన సంగ్రహాలయాన్ని "మ్యూజియంను" స్థాపించడానికి ఈ ప్రదర్శన బీజరూపమవుతుంది. తెలుగువారి సంస్కృతిని నిరూపించే సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజులపాటు సాగుతవి. తెలుగు ప్రజలు సంస్కృతీ సంప్రదాయలను విశదంచేసే ప్రత్యేక సంచికలు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషలలో విడుదల అవుతాయి. ఈ కార్యక్రమాలలో భాగమే ఈ గ్రంధ ప్రచురణ.

  తెలుగు ప్రజల భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన వివిధ రంగాలలో సాధించిన ఘన విజయాలను విశదంచేసే గ్రంధాలు అనేకం ఈ మహాసభల సమయంలో విడుదల అవుతాయి.  ఈ గ్రంధాలను రచించి, సకాలంలో మాకు అందించిన రచయితలందరకూ నాకృతజ్ఞతలు.  ఈ గ్రంధాలను ప్రచురించే భారం వహించడానికి ముందుకువచ్చిన అకాడమీ అధినేతలందరి ఆదరణ పొందగలవని విశ్వశిస్తున్నాను.  అయితే, ఇంతమాత్రంచేతనే ప్రపంచ తెలుగు మహాసభల ఆశయాలు సఫలం కాగలవని నేను అనుకోవడంలేదు.  చేయవలసినది ఇంకా ఎంతో ఉంది.  ఈ మహాసభల సందర్భంగా నెలకొల్పబడనున్న "అంతర్జాతీయ తెలుగు విజ్ఞానసంస్థ" మహాసభల ఆశయ సాధనకు పూనుకొనడమే కాక జాతీయ, అంతర్జాతీయ్ సాంస్కృతిక సంబంధాలను దృడత్వం చేయగ్లల్దని నమ్ముతున్నాను.

జలగం వెంగళరావు

అధ్యక్షులు

ప్రపంచ తెలుగు మహాసభలు