పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము

________

సాహిత్యాదర్శము

ఆర్యసాహిత్యప్రకృతి

ధర్మమే ప్రాణమని యెంచు ఆర్యజాతివారు తమ సాహిత్యమున ధర్మజయఘోషణమే కావించిరి. మహాభారతమున వేదవ్యాసుడు పతివ్రతాశిరోమణియగు గాంధారిచే నిట్లు పలికించును.

"యతోధర్మస్తతోజయ:"

ధర్మముండెడు చోటనే తనరు జయము

ఆమెయే శ్రీకృష్ణుని స్తుతించుచు నిట్లనెను: -

"జయోస్తు పాండుపుత్రాణాం యేషాంపక్షే జనార్దన:"

వాసుదేవుండు తమప్రక్క వరలుగాన

విజయమగు గాతమా పాండవేయులకును*[1]

  1. *క. ఎక్కడనడచును సత్యం బెక్కడధర్మంబు పరగు నెక్కడగలుగుం జక్కటినిలుచుం గృష్ణుండక్కడ నతడున్న కతన నగుజయ మధిపా|| తిక్కన - ఉద్యో||పర్వ||