ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మొదటి ప్రకరణము
________
సాహిత్యాదర్శము
ఆర్యసాహిత్యప్రకృతి
ధర్మమే ప్రాణమని యెంచు ఆర్యజాతివారు తమ సాహిత్యమున ధర్మజయఘోషణమే కావించిరి. మహాభారతమున వేదవ్యాసుడు పతివ్రతాశిరోమణియగు గాంధారిచే నిట్లు పలికించును.
"యతోధర్మస్తతోజయ:"
ధర్మముండెడు చోటనే తనరు జయము
ఆమెయే శ్రీకృష్ణుని స్తుతించుచు నిట్లనెను: -
"జయోస్తు పాండుపుత్రాణాం యేషాంపక్షే జనార్దన:"
వాసుదేవుండు తమప్రక్క వరలుగాన
విజయమగు గాతమా పాండవేయులకును*[1]
- ↑ *క. ఎక్కడనడచును సత్యం బెక్కడధర్మంబు పరగు నెక్కడగలుగుం జక్కటినిలుచుం గృష్ణుండక్కడ నతడున్న కతన నగుజయ మధిపా|| తిక్కన - ఉద్యో||పర్వ||