పుట:SaakshiPartIII.djvu/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మావశ్యకము లేదు. మంచి గ్రంథములు వారు రచించునెడల వాని నప్పడప్పడు పరిషత్తువా రచ్చువేయింప వలయును.

బిరుదములు:-ఆర్యులారా! మరియొక చిన్న విన్నప మున్నది. ఆంధ్రదేశపండితులలోఁ గొందరు సర్కారువారు బిరుదములు నొసంగుచున్నారు. సర్వసం గపరిత్యాగు లైన సన్యాసులు సైతము వదలని వదలగూడని భాషాభిమానముచే భాషావిద్వాం సులలోఁ గొందఱకు బిరుదము లిచ్చినారు. శంకరాచార్య పీఠస్థులొకరు బ్రహ్మశ్రీ కొక్కొండ వేంకటరత్నముపంతులవారి కొక బిదుద మిచ్చినారు. వానమామల జియ్యరు గారు శ్రీమాన్ కాండూరి భాష్యకారాచార్యుల వారికిఁ గవి సార్వభౌముఁడను బిరుదమును గాబోలుం గటాక్షించిరి. కామకోటి శంకరాచార్యపీఠస్థులు మన బ్రహ్మశ్రీ వేదము వేంకటరాయ శాస్త్రిగారి కనేకబిదుదము లీనడుమనే యిచ్చినట్టు వినుచున్నాము. తుదకుఁ గాళీ ఘట్టమున నున్నసంఘమువా రెవరో మనయాంధ్ర దేశీయపండితులకు బిరుదము లిచ్చి బహుమానించుచున్నారు. కాని మనసాహిత్య పరిషత్తు వా రిచ్చుచున్న దేమున్నది? మనవారిచ్చుచున్నవి రెండే బిరుదము; సామాన్యసభ్యుఁడు, కార్యనిర్వాహకసభ్యుడు. ఇంతే. ఈ బిరుదమునైన నేదో కొంత దక్షిణ తీసికొని యిచ్చుచున్నారు. కాని పాండిత్యబ హూకృతిగా నిచ్చుటలేదు. మీ కాంధ్రదేశమున బిరుదార్డులైన పండితులు కనఁబడనేలేదా యేమి? అటులైన మీకుఁ గనబడనివారు పైవారి కెట్టు కనబడుచున్నారు? ఒకరి కిచ్చినయెడల మిగిలినవారు మాకేల యీయకపోవలయునని వివాదపడుదురేమో యనుసం దేహమున మానివైచితిరా! అటులైన సర్కారువారిపైనున్న, శంకరాచార్యులవారి పైనను నిందుల కిప్పడు వ్యాజ్యములు తెచ్చినవా రెవ్వరు? బిరుదముల కర్ణులైన పండితు లందరు మనసాహిత్య పరిషత్తులోనే యున్నారు. కాని బిరుదములను గూర్చి యేపండితుఁడుగూడ నిదివఱకు ముచ్చటించి యుండలేదు. ఎందుకో మీరెఱుఁగరా? ఏపండితుఁడైన ముచ్చటిం చినయెడలఁ దనకు బిరు దిమ్మని యడుగుచున్నాఁడని పైవా రనుకొని పోవుదు రనుభయముచేఁ బండితు లెవ్వరుఁ గిక్కురుమనకుండమన్నారు. నే నాపాండిత్యబాధ లేనివాఁడను గావున నిర్భయముగాఁ బలికితిని. ఆపండితుని సభాధ్యక్షునిగా నెన్నుకొనుట వలనఁ గలిగిన లాభ మిది. ఇంతకంటె నే నిష్పడు చెప్పఁదగినది లేదు. సాహిత్యపరిషత్తు నిచ్చటి కాహ్వానించిన భాషాపోషకులగు శ్రీపీఠికాపుర మహారాజుగారి యెడలఁ గృతజ్ఞలమై యుండి వారి క్షేమాయురారోగ్యైశ్వ ర్యాభివృద్దులకు భగవంతునిఁ బ్రార్ధింపవలయును.